Sridhar Vembu Divorce Case: చాలా ఖరీదైన విడాకుల కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridhar Vembu Divorce Case: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన విడాకులకు సంబంధించిన వార్తలతో సంచలనం సృష్టించారు. శ్రీధర్ వెంబు విడాకుల కేసు ప్రస్తుతం అమెరికా కోర్టులో నడుస్తోంది. వీరికి అక్కడి కోర్టు విడాకులు మంజూరు చేస్తే, ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబును ప్రస్తుతం కొనసాగుతున్న విడాకుల కేసులో 1.7 బిలియన్ డాలర్లు లేదా రూ.15 వేల కోట్లకు పైగా బాండ్లను డిపాజిట్ చేయాలని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. వెంబు మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్ అమెరికాలో నివసిస్తున్న విద్యావేత్త, వ్యవస్థాపకురాలు.
READ ALSO: Trump-Machado: వైట్హౌస్కు రానున్న వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో.. ఏం జరుగుతోంది?
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
- Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
- SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
పలు నివేదికల ప్రకారం.. ఈ ఉత్తర్వు జనవరి 2025లో ఆమోదించబడింది. కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జోహో సంస్థలను పర్యవేక్షించడానికి ఒక రిసీవర్ను నియమించింది. కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులో ఈ కేసు రికార్డు పిటిషనర్ (శ్రీధర్) కమ్యూనిటీ ఆస్తులలో ప్రతివాది (ప్రమీల) ప్రయోజనాలను విస్మరించారని, చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టంగా నిరూపిస్తున్నట్లు పేర్కొంది.
జోహో ఆస్తులపై వివాదం..
ప్రమీలా శ్రీనివాసన్ నవంబర్ 2024లో తన దరఖాస్తులో, అమెరికాకు చెందిన జోహో కార్పొరేషన్ (చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ZCPL) పూర్తి అనుబంధ సంస్థ)లో తన వాటాలలో గణనీయమైన భాగాన్ని శ్రీధర్ దీర్ఘకాల సహచరుడికి చెందిన సంస్థకు ఆయన రహస్యంగా బదిలీ చేశారని పేర్కొన్నారు. ఈ లావాదేవీ మూడు దశల్లో జరిగాయని, “శ్రీధర్ ఉద్యోగాన్ని వదిలివేసి తన వ్యాపారంపై దృష్టి పెట్టడానికి నా ఆదాయంతో నేను అతనికి మద్దతు ఇచ్చాను” అని ప్రమీల చెప్పినట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. “విడాకుల కోసం దాఖలు చేసిన తర్వాత మాత్రమే అతను మా వివాహ సమయంలో సృష్టించిన కంపెనీలో 5 శాతం మాత్రమే కలిగి ఉన్నాడని, అతని సోదరులు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నారని తెలుసుకుని నేను చాలా షాక్ అయ్యాను” అని ఆమె చెప్పినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.
అయితే వెంబు ఈ వాదనను తోసిపుచ్చాడు. జోహో సహ వ్యవస్థాపకుడిగా, దీర్ఘకాలం CEOగా పనిచేస్తున్నప్పటికీ, జోహోలో తన వాటా ఎల్లప్పుడూ 5 శాతం మాత్రమే అని నొక్కి చెప్పాడు. ఫోర్బ్స్ 2025 జాబితా ప్రకారం.. వెంబు, అతని సోదరులు (ఇప్పుడు కంపెనీ షేర్లలో ఎక్కువ భాగం (80 శాతానికి పైగా) కలిగి ఉన్నారు) $6 బిలియన్ల నికర విలువను కలిగి ఉన్నారు. దాదాపు ముప్పై సంవత్సరాల వివాహం, USలో ఒక కొడుకును పెంచిన తర్వాత వెంబు 2019 చివరిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. ప్రమీలా శ్రీనివాసన్- శ్రీధర్ వెంబు విడాకుల చర్యలు 2021లో ప్రారంభమయ్యాయి. ..
READ ALSO: Trump-Machado: వైట్హౌస్కు రానున్న వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో.. ఏం జరుగుతోంది?
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..