Zee-Sony Merger: జీ-సోనీ విలీనం.. ఆమోదించిన NCLT
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zee-Sony Merger: జీ-సోనీ విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) అంగీకారం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరియు సోనీ పిక్చర్స్ అని పిలువబడే కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ మధ్య విలీన పథకానికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. రెండు సంస్థల మధ్య అభ్యంతరాలన్నింటినీ కొట్టివేస్తున్నట్టు జులై 10న మౌఖిక ప్రకటనలో పేర్కొన్న కోర్టు .. తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. Zee మరియు Sony సంస్థలు డిసెంబర్ 2021లో విలీనానికి అంగీకరించాయి. NSE, BSE మరియు SEBI మరియు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాతో సహా ఇతర రంగాల నియంత్రణ సంస్థల నుండి అవసరమైన ఆమోదాలను స్వీకరించిన తరువాత, విలీనం యొక్క తుది అనుమతి కోసం కంపెనీ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఎస్సెల్ గ్రూప్కు చెందిన పలువురు రుణదాతలు స్కీమ్లో పొందుపరిచిన నాన్ కాంపీట్ ఫీజ్ కింద అభ్యంతరాలు దాఖలు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్సెల్ మారిషస్-ఎస్సెల్ గ్రూప్ సంస్థ-సోనీ గ్రూప్ సంస్థ అయిన SPE మారిషస్ నుండి నాన్ కాంపీట్ ఫీజ్ కింద రూ. 1,100 కోట్లను పొందనుంది.
Read also: Water Apple: ఈ పండు ఒక్కటి చాలు… షుగర్ కంట్రోల్ అయినట్లే!
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
- Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
- ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
గతంలో ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో ఎన్ఎస్ఇ మరియు బిఎస్ఇలు ఎస్సెల్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రెండు సెబి ఆర్డర్లను కూడా నమోదు చేశాయి. ఇందులో జీ మాజీ సీఈవో పునీత్ గోయెంకాను కంపెనీ బోర్డుల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా అప్పుడు వెలువడ్డాయి. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తర్వాత ఈ ఉత్తర్వును సమర్థించింది మరియు తదుపరి పరిశీలన కోసం సెబీకి తిరిగి పంపింది. అయితే విలీన సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా గోయెంకా నియామకం పథకంలోని కీలక భాగాలలో ఒకటి కాబట్టి, విలీనానికి సంబంధించిన ఆర్డర్కు చాలా ప్రాముఖ్యత ఉందని అభ్యంతరాలున్న వారు వాధించారు. అయితే ఈ నిబంధన క్లిష్టమైనది కాదని, గోయెంకా అనర్హతతో సంబంధం లేకుండా విలీనం కొనసాగించాలని జీ సమర్పించింది. అయితే ఒక సంస్థకు మెర్జ్ సమయంలో ఉన్న ఎండీ, సీఈవోనే తిరిగి సీఈవో, ఎండీగా కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
- Tags
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!