Zee-Sony Merger: జీ-సోనీ విలీనం.. ఆమోదించిన NCLT
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zee-Sony Merger: జీ-సోనీ విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) అంగీకారం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరియు సోనీ పిక్చర్స్ అని పిలువబడే కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ మధ్య విలీన పథకానికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. రెండు సంస్థల మధ్య అభ్యంతరాలన్నింటినీ కొట్టివేస్తున్నట్టు జులై 10న మౌఖిక ప్రకటనలో పేర్కొన్న కోర్టు .. తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. Zee మరియు Sony సంస్థలు డిసెంబర్ 2021లో విలీనానికి అంగీకరించాయి. NSE, BSE మరియు SEBI మరియు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాతో సహా ఇతర రంగాల నియంత్రణ సంస్థల నుండి అవసరమైన ఆమోదాలను స్వీకరించిన తరువాత, విలీనం యొక్క తుది అనుమతి కోసం కంపెనీ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఎస్సెల్ గ్రూప్కు చెందిన పలువురు రుణదాతలు స్కీమ్లో పొందుపరిచిన నాన్ కాంపీట్ ఫీజ్ కింద అభ్యంతరాలు దాఖలు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్సెల్ మారిషస్-ఎస్సెల్ గ్రూప్ సంస్థ-సోనీ గ్రూప్ సంస్థ అయిన SPE మారిషస్ నుండి నాన్ కాంపీట్ ఫీజ్ కింద రూ. 1,100 కోట్లను పొందనుంది.
Read also: Water Apple: ఈ పండు ఒక్కటి చాలు… షుగర్ కంట్రోల్ అయినట్లే!
Also Read
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
- BSNL దూకుడు.. జియో, ఎయిర్టెల్కు షాక్..
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
గతంలో ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో ఎన్ఎస్ఇ మరియు బిఎస్ఇలు ఎస్సెల్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రెండు సెబి ఆర్డర్లను కూడా నమోదు చేశాయి. ఇందులో జీ మాజీ సీఈవో పునీత్ గోయెంకాను కంపెనీ బోర్డుల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా అప్పుడు వెలువడ్డాయి. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తర్వాత ఈ ఉత్తర్వును సమర్థించింది మరియు తదుపరి పరిశీలన కోసం సెబీకి తిరిగి పంపింది. అయితే విలీన సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా గోయెంకా నియామకం పథకంలోని కీలక భాగాలలో ఒకటి కాబట్టి, విలీనానికి సంబంధించిన ఆర్డర్కు చాలా ప్రాముఖ్యత ఉందని అభ్యంతరాలున్న వారు వాధించారు. అయితే ఈ నిబంధన క్లిష్టమైనది కాదని, గోయెంకా అనర్హతతో సంబంధం లేకుండా విలీనం కొనసాగించాలని జీ సమర్పించింది. అయితే ఒక సంస్థకు మెర్జ్ సమయంలో ఉన్న ఎండీ, సీఈవోనే తిరిగి సీఈవో, ఎండీగా కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
- Tags
తాజావార్తలు
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
-
Arctic: ఆర్కిటిక్లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
-
Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
-
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!