NTV Telugu Site icon

Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!

Bhavesh Chaudhary

Bhavesh Chaudhary

హర్యానా యువ పారిశ్రామికవేత్త భవేష్ చౌదరి ‘కసుతం బిలోనా ఘీ’ పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ఏ2 నెయ్యిని విక్రయిస్తూ కోట్లాది వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించాడు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నెయ్యిని ప్రజలకు అందించడమే భవేష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం రూ.3 వేలతో పనులు ప్రారంభించాడు. భావేష్ చౌదరి విజయ ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం. భవేష్ చౌదరి కేవలం రూ.3 వేల పెట్టుబడితో గ్రామంలో ఉంటూ కోట్ల రూపాయల నెయ్యి వ్యాపారం చేశాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు లేదా పేరు పెద్ద నగరాల్లో మాత్రమే సంపాదించవచ్చు అని భావించే యువతకు ఈ కథ ఒక ప్రేరణ. భవేష్ కుటుంబంలో చాలా మంది ఆర్మీలో ఉన్నారు. అందువల్ల.. అతడు కూడా సైన్యంలో చేరాలని కోరారు. భవేష్ చదువు మానేసి డబ్బు వృథా చేస్తున్నారంటూ అవహేళన చేసేవారు. కానీ.. భవేష్ మాత్రం ఏదో ఒకటి సాధించాలనుకున్నాడు. బీఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ.. ఆసక్తి లేకపోవడంతో మధ్యలోనే వదిలేశాడు. దీంతో భవేష్ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు భవేష్ కూలి లేక వ్యవసాయం చేస్తాడని అందరూ భావించారు. కానీ, భవేష్ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. ఏదైనా ఆన్‌లైన్ వ్యాపారం చేయాలనుకున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు.

READ MORE: 6 Balls 6 Fours: ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..

నగరాల్లో పల్లెటూరి నెయ్యి డిమాండ్‌..
అప్పుడు బీఎస్సీ చదువుతున్న రోజుల్లో హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి. అతని రూమ్‌మేట్‌లు గ్రామం నుంచి స్వచ్ఛమైన నెయ్యి తీసుకురావాలని తరచుగా అభ్యర్థించేవారు. నగరాల్లో స్వచ్ఛమైన పల్లెటూరి నెయ్యికి ఎంత డిమాండ్ ఉందో భవేష్ కి అర్థమైంది. కల్తీ లేని దేశీ నెయ్యి కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఇక్కడి నుంచే భవేష్‌కి నెయ్యి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతనికి ప్యాకేజింగ్ గురించి అవగాహన లేదు. మార్కెటింగ్ లేదు. వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు లేదు. భవేష్ ఓటమిని అంగీకరించలేదు. యూట్యూబ్ నుంచి సహాయం తీసుకున్నాడు. తన తల్లి నెయ్యి చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ఇది మాత్రమే కాదు… క్రమంగా వారి స్వచ్ఛమైన దేశీ నెయ్యికి డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. నేడు కోట్ల వ్యాపారం చేస్తున్నాడు.

READ MORE: Occult Worship: వికారాబాద్ లో క్షుద్ర పూజల కలకలం… కాలేజ్ లో ఆవరణలో ఆనవాళ్లు..

వేల మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది
భవేష్ బిలోనా పద్ధతిలో A2 ఆవు పాలతో నెయ్యి తయారు చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియా ద్వారా.. అతను కేవలం ఒక వారంలో తన మొదటి ఆర్డర్‌ను పొందాడు. ఈ క్రమంలో రూ.1,125 సంపాదించాడు. ఇది అతని విజయవంతమైన ప్రయాణానికి నాంది. భవేష్ తన కృషి, అంకితభావంతో 15,000 మందికి పైగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఈ రోజు అతని నెయ్యికి భారతదేశం అంతటా డిమాండ్ ఉంది. ప్రతినెలా రూ.70 లక్షలు సంపాదిస్తున్నాడు. భవేష్ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. ‘కసుతం బిలోన నెయ్యి’ ద్వారా అతను విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన, సాంప్రదాయ ఆహారాన్ని రుచి చూపించాడు. అతని వెంచర్ విలువ రూ.8 కోట్లు అయింది. అతని కథ నవయుగ పారిశ్రామికవేత్తలకు ప్రేరణ కంటే తక్కువ కాదు. కఠోర శ్రమ, అంకితభావం, సరైన వ్యూహం ఉంటే ఎప్పుడైనా, ఎక్కడైనా విజయం సాధించవచ్చని భవేష్ నిరూపించాడు.