Site icon NTV Telugu

Stock Market: శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్తోంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు జోష్ వచ్చింది. నిన్న ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఈరోజు మాత్రం భారీ లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగవచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం వచ్చింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 324 పాయింట్లు లాభపడి 78, 844 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 24, 453 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.

Exit mobile version