UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ చెల్లింపుల్లో వేగానికి మారుపేరైన యూపీఐ (UPI) లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక మార్పును తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. అయితే, ఈ వేగాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకసారి డబ్బులు పంపాక వాటిని వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల (High-value transfers) విషయంలో సుమారు ఒక గంట పాటు ‘కూలింగ్-ఆఫ్ పీరియడ్’ (విరామ సమయం) ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఎందుకు ఈ మార్పు.. ?
Also Read
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
పొరపాటున ఎవరికైనా తప్పుడు అడ్రస్కు డబ్బులు పంపితే, ఆ గంట లోపు లావాదేవీని ఆపే అవకాశం (Reversal window) ఉంటుంది. చాలామందిని ఫోన్ల ద్వారా భయపెట్టో, ఆశ చూపించో నేరగాళ్లు డబ్బులు పంపించుకుంటారు. ఈ గంట సమయం ఉంటే, బాధితులు ఆలోచించుకుని ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కేవలం పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే డబ్బులకే వర్తిస్తుంది. మీరు దుకాణాల్లో వస్తువులు కొన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిన్నపాటి చెల్లింపులు చేసినా అవి ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి.
Also Read:RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
డిజిటల్ చెల్లింపులు వేగంగా ఉండటమే కాదు, సురక్షితంగా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి ఈ “గోల్డెన్ అవర్” (మొదటి గంట) ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఆందోళన చెందకుండా, ధీమాగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మొత్తానికి.. యూపీఐ వేగాన్ని తగ్గించడం కంటే, వినియోగదారుల డబ్బుకు భద్రత కల్పించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!