UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ చెల్లింపుల్లో వేగానికి మారుపేరైన యూపీఐ (UPI) లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక మార్పును తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. అయితే, ఈ వేగాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకసారి డబ్బులు పంపాక వాటిని వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల (High-value transfers) విషయంలో సుమారు ఒక గంట పాటు ‘కూలింగ్-ఆఫ్ పీరియడ్’ (విరామ సమయం) ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఎందుకు ఈ మార్పు.. ?
Also Read
- Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
- Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
పొరపాటున ఎవరికైనా తప్పుడు అడ్రస్కు డబ్బులు పంపితే, ఆ గంట లోపు లావాదేవీని ఆపే అవకాశం (Reversal window) ఉంటుంది. చాలామందిని ఫోన్ల ద్వారా భయపెట్టో, ఆశ చూపించో నేరగాళ్లు డబ్బులు పంపించుకుంటారు. ఈ గంట సమయం ఉంటే, బాధితులు ఆలోచించుకుని ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కేవలం పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే డబ్బులకే వర్తిస్తుంది. మీరు దుకాణాల్లో వస్తువులు కొన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిన్నపాటి చెల్లింపులు చేసినా అవి ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి.
Also Read:RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
డిజిటల్ చెల్లింపులు వేగంగా ఉండటమే కాదు, సురక్షితంగా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి ఈ “గోల్డెన్ అవర్” (మొదటి గంట) ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఆందోళన చెందకుండా, ధీమాగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మొత్తానికి.. యూపీఐ వేగాన్ని తగ్గించడం కంటే, వినియోగదారుల డబ్బుకు భద్రత కల్పించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!