UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ చెల్లింపుల్లో వేగానికి మారుపేరైన యూపీఐ (UPI) లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక మార్పును తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. అయితే, ఈ వేగాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకసారి డబ్బులు పంపాక వాటిని వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల (High-value transfers) విషయంలో సుమారు ఒక గంట పాటు ‘కూలింగ్-ఆఫ్ పీరియడ్’ (విరామ సమయం) ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఎందుకు ఈ మార్పు.. ?
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
పొరపాటున ఎవరికైనా తప్పుడు అడ్రస్కు డబ్బులు పంపితే, ఆ గంట లోపు లావాదేవీని ఆపే అవకాశం (Reversal window) ఉంటుంది. చాలామందిని ఫోన్ల ద్వారా భయపెట్టో, ఆశ చూపించో నేరగాళ్లు డబ్బులు పంపించుకుంటారు. ఈ గంట సమయం ఉంటే, బాధితులు ఆలోచించుకుని ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కేవలం పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే డబ్బులకే వర్తిస్తుంది. మీరు దుకాణాల్లో వస్తువులు కొన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిన్నపాటి చెల్లింపులు చేసినా అవి ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి.
Also Read:RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
డిజిటల్ చెల్లింపులు వేగంగా ఉండటమే కాదు, సురక్షితంగా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి ఈ “గోల్డెన్ అవర్” (మొదటి గంట) ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఆందోళన చెందకుండా, ధీమాగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మొత్తానికి.. యూపీఐ వేగాన్ని తగ్గించడం కంటే, వినియోగదారుల డబ్బుకు భద్రత కల్పించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!