Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు వెనక్కి వెళ్తుండటంతో రూపాయి విలువ ఏకంగా రూ.96.68 మార్కును దాటి సరికొత్త రికార్డు స్థాయి పతనానికి చేరుకుంది. ఈ పరిణామం దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ కరెన్సీకి అండగా నిలిచేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరతను తీర్చేందుకు భారత కేంద్ర బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది.
మే 26, 2026న భారీ ఎత్తున 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లకు పైగా) విలువైన ‘డాలర్-రూపీ బై/సెల్ స్వాప్ ఆక్షన్’ నిర్వహించనున్నట్లు ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. మూడేళ్ల సుదీర్ఘ గడువుతో కూడిన ఈ ప్రత్యేక ఆర్థిక చర్య ద్వారా మార్కెట్లో స్థిరత్వం తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఆర్బీఐ, దేశంలోని కమర్షియల్ బ్యాంకుల మధ్య జరుగుతుంది.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
మొదట మే 26న జరిగే వేలంలో అర్హత గల బ్యాంకులు తమ వద్ద ఉన్న యూఎస్ డాలర్లను ప్రస్తుత రిఫరెన్స్ రేటు ప్రకారం ఆర్బీఐకి విక్రయిస్తాయి. దానికి బదులుగా ఆర్బీఐ నుంచి భారీ మొత్తంలో భారతీయ రూపాయలను పొందుతాయి. ఇది మే 29, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. రెండో దశలో.. ఈ ఒప్పందం ప్రకారం, సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మే 29, 2029న, బ్యాంకులు తాము ఆర్బీఐకి అమ్మిన డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం రేటు చెల్లించి తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో పాల్గొనడానికి కనీస బిడ్ పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. బ్యాంకులు తమకు నచ్చిన ప్రీమియం మొత్తాన్ని పైసల రూపంలో కోట్ చేస్తూ ఎన్ని బిడ్లయినా దాఖలు చేయవచ్చు.
రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోకుండా నియంత్రించడానికి ఆర్బీఐ మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో రూపాయి కొరత ఏర్పడింది.
ఇప్పుడు ఈ రూ.41,000 కోట్ల విలువైన స్వాప్ ఆక్షన్ ద్వారా మార్కెట్లోకి శాశ్వత ప్రాతిపదికన రూపాయి నిధులు వచ్చి చేరుతాయి. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత పెరిగి, వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే విదేశీ మారక నిల్వలకు తాత్కాలికంగా డాలర్ల అండ లభిస్తుంది. ఫలితంగా, డాలర్కు ఉన్న విపరీతమైన డిమాండ్ కాస్త తగ్గి, రూపాయి మరింత దిగజారకుండా బ్రేకులు పడతాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!