Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు వెనక్కి వెళ్తుండటంతో రూపాయి విలువ ఏకంగా రూ.96.68 మార్కును దాటి సరికొత్త రికార్డు స్థాయి పతనానికి చేరుకుంది. ఈ పరిణామం దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ కరెన్సీకి అండగా నిలిచేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరతను తీర్చేందుకు భారత కేంద్ర బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది.
మే 26, 2026న భారీ ఎత్తున 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లకు పైగా) విలువైన ‘డాలర్-రూపీ బై/సెల్ స్వాప్ ఆక్షన్’ నిర్వహించనున్నట్లు ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. మూడేళ్ల సుదీర్ఘ గడువుతో కూడిన ఈ ప్రత్యేక ఆర్థిక చర్య ద్వారా మార్కెట్లో స్థిరత్వం తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఆర్బీఐ, దేశంలోని కమర్షియల్ బ్యాంకుల మధ్య జరుగుతుంది.
Also Read
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
మొదట మే 26న జరిగే వేలంలో అర్హత గల బ్యాంకులు తమ వద్ద ఉన్న యూఎస్ డాలర్లను ప్రస్తుత రిఫరెన్స్ రేటు ప్రకారం ఆర్బీఐకి విక్రయిస్తాయి. దానికి బదులుగా ఆర్బీఐ నుంచి భారీ మొత్తంలో భారతీయ రూపాయలను పొందుతాయి. ఇది మే 29, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. రెండో దశలో.. ఈ ఒప్పందం ప్రకారం, సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మే 29, 2029న, బ్యాంకులు తాము ఆర్బీఐకి అమ్మిన డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం రేటు చెల్లించి తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో పాల్గొనడానికి కనీస బిడ్ పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. బ్యాంకులు తమకు నచ్చిన ప్రీమియం మొత్తాన్ని పైసల రూపంలో కోట్ చేస్తూ ఎన్ని బిడ్లయినా దాఖలు చేయవచ్చు.
రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోకుండా నియంత్రించడానికి ఆర్బీఐ మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో రూపాయి కొరత ఏర్పడింది.
ఇప్పుడు ఈ రూ.41,000 కోట్ల విలువైన స్వాప్ ఆక్షన్ ద్వారా మార్కెట్లోకి శాశ్వత ప్రాతిపదికన రూపాయి నిధులు వచ్చి చేరుతాయి. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత పెరిగి, వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే విదేశీ మారక నిల్వలకు తాత్కాలికంగా డాలర్ల అండ లభిస్తుంది. ఫలితంగా, డాలర్కు ఉన్న విపరీతమైన డిమాండ్ కాస్త తగ్గి, రూపాయి మరింత దిగజారకుండా బ్రేకులు పడతాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!