RapidEVChargE : హైదరాబాద్లో ఈవీ ఛార్జర్ తయారీ యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈవీ (ఎలక్రిక్ వెహికల్) ఛార్జర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని రాపిడ్ ఈవీ చార్జ్-ఈ (RapidEVChargE) యోచిస్తోంది. ఎలక్ట్రికల్ ఛార్జర్ల తయారీ మరియు సంబంధిత సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడంలో ఉన్న రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ, తెలంగాణ హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ తయారీ యూనిట్ను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ ప్రస్తుతం కోయంబత్తూరులో ఛార్జర్లను తయారు చేస్తోందని కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి శివసుబ్రమణ్యం తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 18 నెలల్లో 1,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. హౌసింగ్ సొసైటీలు, మాల్స్, ఆసుపత్రులు మరియు ఇతర పార్కింగ్ ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్స్టాలేషన్ ఖర్చులను భరించే ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల ద్వారా ఇవి ఉంటాయని, ఇది ఛార్జర్లు, సాఫ్ట్వేర్లను అందిస్తుందని ఆయన తెలిపారు. ఛార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ను బట్టి రూ.40,000 నుండి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు.
Also Read
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
- Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్... కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ఛార్జింగ్ పాయింట్లు స్లో ఛార్జర్లను కలిగి ఉంటాయని, వీటికి దాదాపు ఆరు గంటల సమయం పడుతుందన్నారు. కేవలం 30 నిమిషాల సమయం పట్టే ఫాస్ట్ ఛార్జర్లు కూడా ఉంటాయని, ఛార్జింగ్ వేగాన్ని బట్టి ఛార్జింగ్ టారిఫ్ యూనిట్కు రూ.8 నుండి 25 వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాయింట్లు అన్ని రకాల వాహనాలకు సరిపోతాయని ఆయన తెలిపారు.
ఇతరులతో పాటు ఇది ఎలక్ట్రిక్ పోల్ ఛార్జింగ్ స్టేషన్ల వంటి ఉత్పత్తులను కూడా కలిగి ఉంది. ఓటీపీ (OTP)తో వినియోగదారులను ప్రమాణీకరించడానికి ఇది పవర్ సాకెట్ మరియు మినీ స్క్రీన్ లేదా క్యూఆర్ (QR Code) కోడ్ని కలిగి ఉంటుంది. స్లాట్ను యాప్లో బుక్ చేసుకోవాలి. ఇది ప్రీపెయిడ్ లావాదేవీ అవుతుంది. ఇటువంటి పోల్స్ ఇప్పటికే కోయంబత్తూరులో ప్రారంభించబడ్డాయి. త్వరలో తెలంగాణలో వాటిని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోందని ఆయన తెలంగాణ తెలిపారు.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!