Hydrogen Train : భారత్లో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..
- 'నీటి'తో నడిచే రైలు
- ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం
- 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్తో రానున్న రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంటుతో కానీ, డీజిల్తో కానీ పనిచేయదు. బదులుగా రైలు ‘నీటి’తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్గా నిర్ణయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రోటోటైప్ రైలు 2024 డిసెంబర్లో పట్టాలెక్కనుంది. భారతీయ రైల్వే దేశంలో హైడ్రోజన్ రైళ్లను నడపబోతోంది. ఈ రైలు హర్యానాలోని జింద్ – పానిపట్ మధ్య 90 కి.మీ. ప్రయాణించనుంది. ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్లో నింపబడుతుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
2030 నాటికి జీరో కార్బన్ దిశ అడుగులు..
భారతీయ రైల్వేలు 2030 నాటికి జీరో కార్బన్ దిశగా పని చేస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ దిలీప్ కుమార్ తెలిపారు. హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ప్రాజెక్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, మౌలిక సదుపాయాల పనులు పైలట్ ప్రాజెక్ట్గా జరుగుతున్నాయి. దీని పరీక్ష విజయవంతమైంది. సెల్, హైడ్రోజన్ ప్లాంట్ రూపకల్పన ఆమోదించబడింది. హైడ్రోజన్ భద్రతకు సంబంధించి గ్లోబల్ ఏజెన్సీలు ఆమోదం తెలిపాయి. భారతీయ రైల్వేలు హైడ్రోజన్ ఇంధనం కోసం ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ల (DEMU) రెట్రో ఫిట్మెంట్ పనిని ప్రదానం చేసింది. ఐసీఎఫ్ చెన్నైలో ప్రోటోటైప్ రైలును తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది.
Also Read
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని ప్లాన్
భారతీయ రైల్వేలు హైడ్రోజన్ హెరిటేజ్ కింద 35 హైడ్రోజన్ రైళ్లను ప్లాన్ చేశాయని, ఇందులో ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుందని, హెరిటేజ్, హిల్ రూట్ల కోసం ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.70 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు దిలీప్ కుమార్ తెలిపారు. రైల్వే జంక్షన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో మొత్తం క్యాంపస్తో సహా భవనాల పైకప్పుల నుంచి నీటిని సేకరించేందుకు డిజైన్ను సిద్ధం చేశారు.
కసరత్తు వేగవంతం..
ఈ నీటి నుంచి హైడ్రాన్ తయారు చేసి రైలును నడపనున్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. ప్లాంట్లో మూడు వేల కిలోల హైడ్రోజన్ స్టోరేజీ ట్యాంక్ను నిర్మించనున్నారు. మొదటి దశలో కేవలం రెండు రైళ్లు మాత్రమే నడపనున్నారు. అదనపు హైడ్రోజన్ను ట్యాంకర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. రైల్వే జంక్షన్లో హైడ్రోజన్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణం రూ.118 కోట్లతో 2022లో ప్రారంభమైంది. రెండు వేల మీటర్ల విస్తీర్ణంలో ఈ గ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇంజిన్ ఆవిరిని విడుదల చేస్తుంది
హైడ్రోజన్ వాయువుతో నడిచే ఇంజిన్లు పొగకు బదులుగా ఆవిరి, నీటిని విడుదల చేస్తాయి. ఈ రైలు సాంప్రదాయ డీజిల్ ఇంజన్ల కంటే 60 శాతం తక్కువ శబ్దాన్ని చేస్తుంది. దీని వేగం, ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కూడా డీజిల్ రైలుతో సమానంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!