Hydrogen Train : భారత్లో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..
- 'నీటి'తో నడిచే రైలు
- ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం
- 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్తో రానున్న రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంటుతో కానీ, డీజిల్తో కానీ పనిచేయదు. బదులుగా రైలు ‘నీటి’తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్గా నిర్ణయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రోటోటైప్ రైలు 2024 డిసెంబర్లో పట్టాలెక్కనుంది. భారతీయ రైల్వే దేశంలో హైడ్రోజన్ రైళ్లను నడపబోతోంది. ఈ రైలు హర్యానాలోని జింద్ – పానిపట్ మధ్య 90 కి.మీ. ప్రయాణించనుంది. ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్లో నింపబడుతుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
2030 నాటికి జీరో కార్బన్ దిశ అడుగులు..
భారతీయ రైల్వేలు 2030 నాటికి జీరో కార్బన్ దిశగా పని చేస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ దిలీప్ కుమార్ తెలిపారు. హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ప్రాజెక్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, మౌలిక సదుపాయాల పనులు పైలట్ ప్రాజెక్ట్గా జరుగుతున్నాయి. దీని పరీక్ష విజయవంతమైంది. సెల్, హైడ్రోజన్ ప్లాంట్ రూపకల్పన ఆమోదించబడింది. హైడ్రోజన్ భద్రతకు సంబంధించి గ్లోబల్ ఏజెన్సీలు ఆమోదం తెలిపాయి. భారతీయ రైల్వేలు హైడ్రోజన్ ఇంధనం కోసం ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ల (DEMU) రెట్రో ఫిట్మెంట్ పనిని ప్రదానం చేసింది. ఐసీఎఫ్ చెన్నైలో ప్రోటోటైప్ రైలును తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని ప్లాన్
భారతీయ రైల్వేలు హైడ్రోజన్ హెరిటేజ్ కింద 35 హైడ్రోజన్ రైళ్లను ప్లాన్ చేశాయని, ఇందులో ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుందని, హెరిటేజ్, హిల్ రూట్ల కోసం ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.70 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు దిలీప్ కుమార్ తెలిపారు. రైల్వే జంక్షన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో మొత్తం క్యాంపస్తో సహా భవనాల పైకప్పుల నుంచి నీటిని సేకరించేందుకు డిజైన్ను సిద్ధం చేశారు.
కసరత్తు వేగవంతం..
ఈ నీటి నుంచి హైడ్రాన్ తయారు చేసి రైలును నడపనున్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. ప్లాంట్లో మూడు వేల కిలోల హైడ్రోజన్ స్టోరేజీ ట్యాంక్ను నిర్మించనున్నారు. మొదటి దశలో కేవలం రెండు రైళ్లు మాత్రమే నడపనున్నారు. అదనపు హైడ్రోజన్ను ట్యాంకర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. రైల్వే జంక్షన్లో హైడ్రోజన్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణం రూ.118 కోట్లతో 2022లో ప్రారంభమైంది. రెండు వేల మీటర్ల విస్తీర్ణంలో ఈ గ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇంజిన్ ఆవిరిని విడుదల చేస్తుంది
హైడ్రోజన్ వాయువుతో నడిచే ఇంజిన్లు పొగకు బదులుగా ఆవిరి, నీటిని విడుదల చేస్తాయి. ఈ రైలు సాంప్రదాయ డీజిల్ ఇంజన్ల కంటే 60 శాతం తక్కువ శబ్దాన్ని చేస్తుంది. దీని వేగం, ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కూడా డీజిల్ రైలుతో సమానంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!