PPF Scheme: పోస్టాఫీస్లో బంఫర్ స్కీమ్.. 12,500తో రూ.40 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PPF Scheme: సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి, బిడ్డ పెళ్లి చేయాలనుకునే వారికి, కొడుకు ఉన్నత చదువు కోసం డబ్బులు ఆదా చేయాలని చూసే వారికి గుడ్ న్యూస్. ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నాను అంటే కచ్చితంగా ఈ పొదుపు మీ దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలదనే భరోసాను ఇవ్వగలదు. ఇందులో పొదుపు చేస్తే మీ డబ్బులకు 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది. ఇక్కడ మరోక విశేషం ఏమిటంటే ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంతకీ ఈ పథకం ఏంటి, ప్రతి నెల ఎంత పొదుపు చేయాలని అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..
రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, పన్ను ప్రయోజనాలు కోరుకునే వారికి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీ బెస్ట్. పీపీఎఫ్ అనేది కేంద్రం సపోర్ట్తో నడిచే ఒక పొదుపు పథకం. మీకు తెలుసా ఈ పథకం ప్రస్తుతం 7.9% వార్షిక వడ్డీని అందిస్తుంది. ప్రతి నెలా రూ.12,500 పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెడితే.. ఏడాదికి మొత్తం రూ.1.5 లక్షలు జమ అవుతాయి. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు. మీరు ఈ 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపు రూ.43.60 లక్షలు చేతికి వస్తాయి. ఇందులో రూ.21 లక్షల పైగా వడ్డీ రూపంలోనే వస్తుంది.
చాలా సింపుల్..
చిన్న మొత్తాలతో దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు రావాలనుకునే వారికి పీపీఎఫ్ ఒక అద్భుతమైన ఆప్షన్. డిజిటల్ యుగం కాబట్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ ద్వారా పోస్ట్ ఆఫీసులో పీపీఎఫ్ ఖాతాను ఫోన్లో తెరుచుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరవాలి. తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతా నుంచి పీపీఎఫ్ ఖాతాకు రూ.12,500 ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెచ్యూరిటీ సమయంలో మీరు పన్నులు ఆదా చేసుకోవడమే కాకుండా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.
మీకు తెలుసా..
కేంద్రం హామీ ఇస్తుంది కాబట్టి పీపీఎఫ్లో డిపాజిట్ చేసే మొత్తం, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం అన్నీ పూర్తిగా పన్ను రహితం. ఇది ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద వర్తిస్తుంది. ఈ పథకం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. ఇక్కడ మరో వెసులుబాటు ఉంది.. ఒకేసారి లేదా నెలవారీ 12 వాయిదాలలో డబ్బును జమ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఖాతా తెరిచిన 3, 6 ఏళ్ల మధ్య మీ డిపాజిట్పై తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు.
READ ALSO: Kaveri Engine: చరిత్ర సృష్టించే దిశగా భారత్.. సక్సెస్ అయితే నయా రికార్డే!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..