NTV Telugu Site icon

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస జోరు కనిపిస్తోంది. ఆసియా మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో గురువారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81, 053 దగ్గర ముగియగా.. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 24, 811 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.93 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌రేప్ నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ నేలమట్టం..(వీడియో)

నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన లాభాల్లో ఉండగా… టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎన్‌టీపీసీ, విప్రో,ఎం అండ్ ఎం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ