Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు
- ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ
- గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ
- ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, సంపద మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి జీతం, అలవెన్సులు, బోనస్లు, పదవీ విరమణ ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్లు వంటి ఎలాంటి పారితోషికాన్ని కూడా స్వీకరించలేదు. ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.95,754 కోట్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ముఖేష్ అంబానీ జీతం ఎంత ఉండేది?
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, అంతకుముందు వార్షిక జీతం రూ.15 కోట్లుగా ఉండేది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచే తన జీతాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తర్వాత రిలయన్స్ వ్యాపారం, లాభాలు భారీగా పెరిగినా కూడా అదే జీత పరిమితిని దాదాపు 12 సంవత్సరాల పాటు కొనసాగించారు.
జీతం తీసుకోకపోతే సంపాదన ఎలా?
ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో కుటుంబానికి ఉన్న భారీ వాటానే ఆస్తుల పెరుగుదలకు ప్రధాన ఆధారం. కంపెనీ షేర్ ధర పెరిగే కొద్దీ నికర సంపద కూడా పెరుగుతుంది. అంతేకాదు, ప్రధాన ఆదాయ వనరు డివిడెండ్లు.
కంపెనీ లాభాల్లో భాగంగా వాటాదారులకు డివిడెండ్ చెల్లిస్తుంది. రిలయన్స్లో ముఖేష్ అంబానీకి సుమారు 16.1 మిలియన్ షేర్లు ఉన్నట్లు సమాచారం. FY2025లో కంపెనీ ఒక్కో షేర్కు రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో ఆయనకు సుమారు రూ.96.6 మిలియన్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. అయితే, ఆదాయం (Income), నికర ఆస్తి విలువ (Net Worth) రెండూ వేర్వేరు అంశాలని గుర్తుంచుకోవాలి.
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రిలయన్స్
Reliance Industries దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ సంస్థగా ఎదిగింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటి. గత ఏడాది రిలయన్స్ సంస్థ లక్ష మందికి పైగా కొత్త ఉద్యోగాలను కల్పించింది. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,19,911కు చేరుకుంది. ఇక జామ్నగర్లో నిర్మాణంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ద్వారా మరో రూ.2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!