Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు
- ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ
- గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ
- ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, సంపద మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి జీతం, అలవెన్సులు, బోనస్లు, పదవీ విరమణ ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్లు వంటి ఎలాంటి పారితోషికాన్ని కూడా స్వీకరించలేదు. ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.95,754 కోట్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ముఖేష్ అంబానీ జీతం ఎంత ఉండేది?
Also Read
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, అంతకుముందు వార్షిక జీతం రూ.15 కోట్లుగా ఉండేది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచే తన జీతాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తర్వాత రిలయన్స్ వ్యాపారం, లాభాలు భారీగా పెరిగినా కూడా అదే జీత పరిమితిని దాదాపు 12 సంవత్సరాల పాటు కొనసాగించారు.
జీతం తీసుకోకపోతే సంపాదన ఎలా?
ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో కుటుంబానికి ఉన్న భారీ వాటానే ఆస్తుల పెరుగుదలకు ప్రధాన ఆధారం. కంపెనీ షేర్ ధర పెరిగే కొద్దీ నికర సంపద కూడా పెరుగుతుంది. అంతేకాదు, ప్రధాన ఆదాయ వనరు డివిడెండ్లు.
కంపెనీ లాభాల్లో భాగంగా వాటాదారులకు డివిడెండ్ చెల్లిస్తుంది. రిలయన్స్లో ముఖేష్ అంబానీకి సుమారు 16.1 మిలియన్ షేర్లు ఉన్నట్లు సమాచారం. FY2025లో కంపెనీ ఒక్కో షేర్కు రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో ఆయనకు సుమారు రూ.96.6 మిలియన్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. అయితే, ఆదాయం (Income), నికర ఆస్తి విలువ (Net Worth) రెండూ వేర్వేరు అంశాలని గుర్తుంచుకోవాలి.
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రిలయన్స్
Reliance Industries దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ సంస్థగా ఎదిగింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటి. గత ఏడాది రిలయన్స్ సంస్థ లక్ష మందికి పైగా కొత్త ఉద్యోగాలను కల్పించింది. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,19,911కు చేరుకుంది. ఇక జామ్నగర్లో నిర్మాణంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ద్వారా మరో రూ.2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!