India Budget 2026: ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక బడ్జెట్ 2026 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్యులు, మహిళలు, రైతులు, యువతపై దృష్టి సారించిందని చెబుతున్నారు. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ బడ్జెట్లో సామాన్యుల కోసం అనేక ప్రధాన ప్రకటనలు చేశారు. ఏడు కొత్త రైల్వే కారిడార్లను కూడా ప్రకటించారు. తీవ్రమైన వ్యాధులకు అవసరం అయిన మందులు కూడా చౌకగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్ సామాన్యులకు అవసరం అయ్యే ఇంకా అనేక ప్రధాన ప్రకటనలు చేయలేదు. నిజానికి ఆ ప్రకటనలు సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని ఆశించారు. సామాన్యుల కోసం చేయని కొన్ని ప్రధాన ప్రకటనలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్పై మమత విమర్శలు
ఆదాయపు పన్నులో మినహాయింపు లేదు
గత బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను విధానంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ‘0’ పన్నును ప్రకటించారు. ఈసారి ఈ పరిమితిని రూ. 14 లక్షలకు పెంచాలని భావించారు. కానీ ప్రభుత్వం దానిలో ఎటువంటి మార్పులు చేయలేదు.
కొత్త పన్ను విధానంలో మినహాయింపులు లేవు..
PPF, NPS, ELSS వంటి పథకాలలో పెట్టుబడులకు కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం దీనికి ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ పథకాలు పాత పన్ను విధానంలో మాత్రమే మినహాయింపుకు అర్హులు. పాత పన్ను విధానంలో ఈ పథకాలలో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు. ప్రధానమంత్రి కిసాన్ యోజన బడ్జెట్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతారని రైతులు ఆశించారు. కానీ ఈ బడ్జెట్లో రైతుల ఆశలను నిజం చేయలేదు. పంటలకు కనీస మద్దతు ధర (MSP) గురించి కూడా ఎటువంటి ప్రధాన ప్రకటన చేయలేదు .
సీనియర్ సిటిజన్లకు దక్కని ఊరట..
ఈ బడ్జెట్ ద్వారా కొన్ని బీమా పథకాలకు మద్దతు లభిస్తుందని, సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు అందిస్తారని భావించారు. కానీ తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి కొత్త రైలు కారిడార్లను మాత్రమే ప్రకటించి, సీనియర్ సిటిజన్లకు TDS తగ్గింపులో ప్రకటించలేదు. దీంతో వారి టిక్కెట్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు దక్కని మినహాయింపు..
ఈ బడ్జెట్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు గణనీయమైన దెబ్బ తగిలింది. ఎఫ్ అండ్ ఓ వ్యాపారులకు లావాదేవీ ఛార్జీలు తగ్గిస్తారని అంచనాలు ఉన్నప్పటికీ వాటిని పెంచారు. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG), స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (STCG) లలో ఎటువంటి మార్పులు చేయలేదు. నిజానికి తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఉపశమనం కల్పిస్తుందని అంచనా వేశారు. కానీ ఎలాంటి చేయలేదు.
