Investment-Profit: 10 వేల పెట్టుబడి. ఏడాదిలోనే 2.77 లక్షలు. అతి భారీ లాభం
Investment-Profit: జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్ కార్ల అతితక్కువ ధర 12 లక్షలు. దీంతో పోల్చితే భవిష్యత్తులో సగం రేటుకే రానుంది.
‘కెనరా’ మరోసారి
Also Read
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్.. టయర్ టు బాండ్ల రూపంలో రూ.3,500 కోట్ల వరకు నిధులను విడతల వారీగా సేకరించనుంది. ఈ మేరకు రేపు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. వృద్ధి అవసరాలకు అనుగుణంగా మూలధన సమృద్ధి నిష్పత్తిని పెంచడం కోసం ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 డిసెంబర్లో కూడా ఈ బ్యాంక్ రూ.2,500 కోట్ల ఫండ్ రైజింగ్ చేసింది.
భారతదేశం.. బ్రాండ్లతో అనుబంధం..
‘చిప్’పైన ఫోకస్
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఈ ఇండస్ట్రీకి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్లు సైతం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం కూడా తాజాగా చిప్ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 2021 డిసెంబర్లోనే రూ.76,000 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
వాణిజ్యానికి ప్రోత్సాహం
2030 నాటికి దేశ ఎగుమతులను రెండు ట్రిలియన్ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా కేంద్ర వాణిజ్య విభాగం చర్యలు చేపడుతోంది. ఎగుమతుల ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురానుంది. దీనికోసం వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రోత్సాహక వ్యూహాల రూపకల్పన, ఎగుమతుల లక్ష్యాల ఏర్పాటు, టార్గెట్లను చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర బాధ్యతలను ఈ మండలికి అప్పగించనున్నారు.
తప్పుడు ప్రచారం
లింక్డిన్ వేదికగా వేలాది మంది తమ కంపెనీ ఉద్యోగులుగా ప్రచారం చేసుకుంటున్నారని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ బినాన్స్ తెలిపింది. ఆ సామాజిక మాధ్యమంలోని 7,000 బినాన్స్ ఎంప్లాయీస్ ప్రొఫైల్స్లో సగం మాత్రమే రియల్ అని, మిగతా సగం ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ విషయంలో తన ఫాలోవర్లు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సీఈఓ హెచ్చరించారు.
టవర్స్ ఫర్ సేల్
బీఎస్ఎన్ఎల్కి దేశవ్యాప్తంగా 68,000 టెలికం టవర్లు ఉండగా వాటిలో 10,000 టవర్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. తద్వారా రూ.4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 13,000 టవర్లను తప్పనిసరిగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో తొలి దశలో 10,000 టవర్లను విక్రయించేందుకు కేపీఎంజీ అనే సంస్థను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది.
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!