GDP: వృద్ధి రేటులో పురోగతి.. భారతే టాప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.. ఫస్ట్ వేవ్ దారుణంగా దెబ్బకుట్టి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగా.. సెకండ్ వేవ్లో కూడా దాని ప్రభావం స్పష్టం కనిపించింది.. అయితే, థర్డ్ వేవ్లో ఆ పరిస్థితి అంతంతే అని చెప్పాలి.. ఎందుకంటే.. క్రమంగా అన్ని దేశాలు వృద్ధిరేటులో పురుగోతి సాధిస్తున్నాయి.. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 5.4 శాతం పురోగమించినట్టు గణాంకాలు చెబుతున్నాయి… వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో ఈ స్థాయి ఎకానమీ పురోగతి ఏ దేశం సాధించకపోవడం మరో విశేషం.. దీనితో ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో.. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారత్.. ఇక, భారత్ తర్వాత చైనా మూడవ త్రైమాసికంలో 4 శాతం ఎకానమీ వృద్ధి రేటు నమోదు చేసింది.. మరోవైపు.. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, వ్యవసాయం, నిర్మాణ, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవా రంగాల వేగం తాజా గణాంకాల ప్రకారం ఇంకా తక్కువగానే ఉన్నాయి.
Read Also: Astrology: మార్చి 1, మంగళవారం దినఫలాలు
Also Read
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఈ మేరకు తాజా గణాంకాలను వెల్లడించింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.3 శాతంగా నమోదైతే.. రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.5 శాతంగా.. ప్రస్తుత సమీక్ష క్వార్టర్లో 5.4 శాతం పురోగతి సాధించింది.. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాల్లో ఎకానమీ పరిస్థితి చూస్తే, కరోనా సవాళ్ల నేపథ్యంలో వృద్ధిలేకపోగా ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్ త్రైమాసికాల్లో వరుసగా 23.8 శాతం, 6.6 శాతం క్షీణత నమోదయ్యాయి. కాగా, అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా 0.7 శాతం పురోగతి కనిపించింది. 2011–12 ధరలను బేస్గా తీసుకుంటూ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికన పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఎకానమీ విలువ రూ.36,22,220 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ విలువ రూ. 38,22,159 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడవ క్వార్టర్లో 5.4 శాతానికి చేరింది.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..