Site icon NTV Telugu

Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

హమ్మయ్య.. చాలా రోజుల తర్వాత నష్టాలకు బ్రేక్ పడ్డాయి. దేశీయ మార్కెట్‌లో వారం ప్రారంభంలో లాభాల పంట పండింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గత కొద్దిరోజులుగా లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోతుంది. ఈ వారం కూడా అదే ఒరవడి కొనసాగుతోందని అంతా భయపడ్డారు. కానీ అనూహ్యంగా ఈ వారం మాత్రం మార్కెట్ భలే పుంజుకుంది. భారీ లాభాలతో ఆయా షేర్లు ముగిశాయి. సెన్సెక్స్ 938 పాయింట్లు లాభపడి 75, 502 దగ్గర ముగియగా.. నిఫ్టీ 257 పాయింట్లు లాభపడి 23, 408 దగ్గర ముగిసింది.

నిఫ్టీలో అత్యధికంగా ఎం అండ్ ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభపడ్డాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, మ్యాక్స్ హెల్త్‌కేర్, సన్ ఫార్మా, కోల్ ఇండియా మాత్రం నష్టపోయాయి. ఆయా రంగాల పరంగా ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ 0.3-1 శాతం పెరిగగా.. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ 0.5-2.7 శాతం మధ్య క్షీణించాయి.

Exit mobile version