EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సరికొత్త వినూత్న అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, ఈ సంస్థ తన ఉద్యోగుల కోసం ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
కంపెనీలో పర్యావరణ అనుకూల వాతావరణాన్ని నిర్మించేందుకు ఈ సంస్థ ఒక సరికొత్త ‘గ్రీన్ పాలసీ’ లేదా ‘ఈవీ పాలసీ’ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపే తమ ఉద్యోగులకు కంపెనీ ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది. కొత్తగా ఈవీ కారు కొనుగోలు చేసే ప్రతి ఉద్యోగికి రూ. 10,000 నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే వారికి రూ. 5,000 నగదు బహుమతిని కంపెనీ అందిస్తుంది.
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ఇటీవల ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పాటు తీవ్ర ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సంక్షోభ సమయాల్లో దేశీయ ఇంధన నిల్వలను కాపాడుకోవడం ఎంతో అవసరమని సంస్థ భావిస్తోంది.
ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ సూచించిన విధంగా కేవలం ఈవీలకు మారడమే కాకుండా, సహోద్యోగులతో కలిసి ప్రయాణించే ‘కార్ పూలింగ్’ పద్ధతిని, ప్రజా రవాణా వ్యవస్థను (మెట్రో, బస్సులు) విరివిగా ఉపయోగించాలని కంపెనీ ఉద్యోగులను కోరుతోంది.
దేశ ప్రగతిలో భాగస్వామ్యం
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఫణిరాజ్ జలిగామ మాట్లాడుతూ.. సాంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించడం కేవలం పర్యావరణానికే కాదు, దేశ ఆర్థిక రంగానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు భారాన్ని తగ్గించడం ద్వారా, దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సుదూర విజన్కు మద్దతుగా నిలుస్తూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అజా కన్సల్టింగ్ సర్వీసెస్ తీసుకున్న ఈ గ్రీన్ ఇనిషియేటివ్ ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. మరికొన్ని ఐటీ , టెక్ సంస్థలు కూడా ఇదే బాటలో నడిచేందుకు ఈ నిర్ణయం స్ఫూర్తిగా నిలవనుంది.
తాజావార్తలు
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!