Job Market: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్ర అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉండి, వారికి భారీ మొత్తంలో జీతాలు పంపిణీ చేస్తున్న కంపెనీ ఏది? అనగానే చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ అదానీకి చెందిన సంస్థలే గుర్తొస్తాయి. కానీ, అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి దేశంలో అత్యధిక జీతాల పంపిణీ చేస్తున్న టాప్ 10 కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. అందులో రిలయన్స్ లేదా అదానీ గ్రూప్ సంస్థలకు చోటు దక్కలేదు.
READ ALSO: LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వార్షిక వేతనాల ఖర్చుల పరంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తిరుగులేని అగ్రస్థానంలో నిలిచింది. జీతాల పంపిణీలో టాప్ 10 కంపెనీలు ఇవే..
ఐటీ రంగానిదే హవా..
ఈ జాబితాను గమనిస్తే సాఫ్ట్వేర్, ఐటీ సేవల రంగం దేశంలో అత్యధిక ఉపాధిని, వేతనాలను అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. టీసీఎస్ మొదటి స్థానంలో ఉండగా, నారాయణమూర్తికి చెందిన ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ రంగం నుంచి ఎస్బీఐ, కోల్ ఇండియా మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటికీ, అంబానీ, అదానీ కంపెనీలు ఐటీ కంపెనీల తరహాలో లక్షలాది మందికి భారీ స్థాయిలో జీతాలు పంపిణీ చేసే జాబితాలో చాలా వెనుకబడి ఉన్నాయి.
