Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?
- 'గ్రో'.. మార్చి క్వార్టర్లో రూ. 686 కోట్ల ప్రాఫిట్
- 122 శాతం పెరిగిన లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Groww Q4 Results: ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ అంచనాలను మించి రాణించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఈ కంపెనీ నికర లాభం విషయానికి వస్తే.. గతేడాదితో పోలిస్తే ఏకంగా 122 శాతం వృద్ధితో రూ.686 కోట్లుగా నమోదైంది. ఆదాయం విషయానికి వస్తే కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 87 శాతం పెరిగి రూ.1,505 కోట్లకు చేరింది. ఎబిటా 142 శాతం జంప్తో రూ.939 కోట్లుగా రికార్డయ్యింది. ఖర్చులను నియంత్రించుకుంటూనే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంలో ‘ఆపరేటింగ్ లీవరేజ్’ ప్లాన్ కంపెనీకి బాగా కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
Also Read
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
F&O ద్వారా భారీ ఆదాయం..
మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ వైపు మొగ్గు చూపారు. దీంతో గ్రో మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 54.6 శాతానికి పెరిగింది. అలాగే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF) వంటి కొత్త ఆప్షన్లు కూడా కంపెనీకి అదనపు బలాన్ని ఇచ్చాయన్నారు. గ్రో ప్లాట్ఫామ్ ద్వారా ప్రస్తుతం 2.16 కోట్ల మంది లావాదేవీలు చేస్తున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ విభాగంలో కూడా కంపెనీ సత్తా చాటింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో కొత్త SIP రిజిస్ట్రేషన్లు 61.5 శాతం పెరిగాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా రూ.25,000 కోట్ల నికర పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చాయి. కస్టమర్ల మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది.
కేవలం బ్రోకింగ్ మాత్రమే కాకుండా, గ్రో తన క్రెడిట్ బిజినెస్ను కూడా విస్తరిస్తోంది. మొత్తం లాభాల్లో ప్రస్తుతం దీని వాటా 4.1 శాతంగా ఉంది. అయితే సబ్సిడరీ సంస్థలైన ‘ఫిస్డమ్’, అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాలు ఇంకా పెట్టుబడుల దశలోనే ఉండటంతో ప్రస్తుతం కొంత నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా లాభాల బాట పడతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
READ ALSO: Lenskart controversy: ఒక్కరోజే లెన్స్కార్ట్కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!