NTV Telugu Site icon

Gold price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gld

Gld

బంగారం కొనాలని అనుకొనేవారికి భారీ షాక్ .. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి.. తులం పై రూ.100 రూపాయలు పెరిగింది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,800కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం పై కూడా రూ.100 పెరిగి, 10గ్రాములు ధర రూ. 63,050కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.500 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ. 76,500 స్థాయికి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,050గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,400గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,700గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది..

బంగారం పెరిగితే .. వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి.. నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయి.. ఇక కేజీ వెండి ధర రూ. 500 పెరిగి 76,500కి చేరింది.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,500.. బెంగళూరులో రూ. 73,250గా ఉంది..అన్ని నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..