పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలోచ్చాయి.. నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,050 గా ఉంది. తాజాగా.. బంగారంపై రూ.100 మేర ధర పెరిగింది. అదే దారిలో వెండి పయనించింది.. వెండి కిలో రూ. 200 మేర పెరిగి.. రూ.76,200 లుగా కొనసాగుతోంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,050గాను ఉంది.. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,050గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది..
వెండి విషయానికొస్తే. ఈరోజు బంగారం దారిలోనే నడిచింది.. కిలో రూ. 200 మేర పెరిగి.. రూ.76,200 లుగా కొనసాగుతోంది..హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,200.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..