Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ మే నెలలో ఇప్పటివరకు వారు రూ. 27,048 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2026 లో మొత్తం ఎఫ్పీఐ అవుట్ఫ్లోలు రూ. 2.2 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2025 మొత్తం సంవత్సరంలో ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా నిలిచారు. జనవరిలో రూ. 35,962 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 lakh కోట్ల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్ నెలలో రూ. 60,847 కోట్లు, మే నెలలో ఇప్పటి వరకు రూ. 27,000 కోట్లకు పైగా ఉపసంహరణలు జరిగాయి.
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా నిపుణుడు హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి, కీలక ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఎఫ్పీఐల నిరంతర విక్రయాలు, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు (CAD) రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని తెచ్చాయని పేర్కొన్నారు. ఏడాది ఆరంభంలో డాలర్తో పోలిస్తే రూ. 90 వద్ద ఉన్న రూపాయి విలువ.. మే 15 నాటికి చారిత్రాత్మక అత్యల్ప స్థాయి రూ. 96.14కు పడిపోయింది.. దీని వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనకు గురయ్యి.. తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
ముడిచమురు ధరలు పెరిగి, ఎఫ్పీఐల విక్రయాలు ఇలాగే కొనసాగితే రూపాయి మరింత బలహీనపడే ప్రమాదముంది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంపెనీల్లోకి భారీగా నిధులు తరలిపోతుండటం వల్ల, ఏఐ రంగంలో వెనుకబడి ఉన్న భారత మార్కెట్ నుంచి నిధులు దారి మళ్లుతున్నాయి. అయితే.. ప్రస్తుతం బబుల్ జోన్లో ఉన్న ఏఐ ట్రేడింగ్ కాస్త చల్లబడినప్పుడు ఈ ట్రెండ్ మళ్లీ మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!