Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ మే నెలలో ఇప్పటివరకు వారు రూ. 27,048 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2026 లో మొత్తం ఎఫ్పీఐ అవుట్ఫ్లోలు రూ. 2.2 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2025 మొత్తం సంవత్సరంలో ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా నిలిచారు. జనవరిలో రూ. 35,962 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 lakh కోట్ల ఉపసంహరణ జరిగింది. ఏప్రిల్ నెలలో రూ. 60,847 కోట్లు, మే నెలలో ఇప్పటి వరకు రూ. 27,000 కోట్లకు పైగా ఉపసంహరణలు జరిగాయి.
Also Read
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
- Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా నిపుణుడు హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి, కీలక ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఎఫ్పీఐల నిరంతర విక్రయాలు, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు (CAD) రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని తెచ్చాయని పేర్కొన్నారు. ఏడాది ఆరంభంలో డాలర్తో పోలిస్తే రూ. 90 వద్ద ఉన్న రూపాయి విలువ.. మే 15 నాటికి చారిత్రాత్మక అత్యల్ప స్థాయి రూ. 96.14కు పడిపోయింది.. దీని వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనకు గురయ్యి.. తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
ముడిచమురు ధరలు పెరిగి, ఎఫ్పీఐల విక్రయాలు ఇలాగే కొనసాగితే రూపాయి మరింత బలహీనపడే ప్రమాదముంది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంపెనీల్లోకి భారీగా నిధులు తరలిపోతుండటం వల్ల, ఏఐ రంగంలో వెనుకబడి ఉన్న భారత మార్కెట్ నుంచి నిధులు దారి మళ్లుతున్నాయి. అయితే.. ప్రస్తుతం బబుల్ జోన్లో ఉన్న ఏఐ ట్రేడింగ్ కాస్త చల్లబడినప్పుడు ఈ ట్రెండ్ మళ్లీ మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన ఘనత.. యుద్ధ విమానాలతో ఇండోనేషియా ఘన స్వాగతం
-
Jr NTR: థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?
-
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
-
Delete Autopay: ఆటోపే ఆప్షన్ పెట్టి మర్చిపోయారా..? అయితే సింపుల్గా ఒకే దగ్గర క్యాన్సిల్ చేసుకోండిలా..
-
Naga Vamsi: “మేం కంటెంట్ ఓనర్లం.. ఎప్పుడు డ్యామేజ్ చేయాలో మాకు తెలుసు!”.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!