Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Britannia Biscuit: యుద్ధం ఎక్కడో జరుగుతుంటే బిస్కెట్ ధరలు ఇక్కడ పెరగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, పశ్చిమ ఆసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతిని ముడి పదార్థాల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఎంత పెరగనుంది? ప్యాకెట్లో ఏ మార్పు రానుందంటే..
బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ రక్షిత్ హర్ గవే తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ ఈ త్రైమాసికం నుంచి ధరలను పెంచే ప్రక్రియను స్టార్ట్ చేయనుంది. రూ.10 పైన ఉన్న ప్యాకెట్ల ధరలను నేరుగా పెంచనున్నారు. చిన్న ప్యాకెట్లు (రూ.5, రూ.10) సామాన్యులకు భారం కాకుండా ఉండటానికి ఈ ప్యాకెట్ల ధరను పెంచకుండా, లోపల ఉండే బిస్కెట్ల సంఖ్యను లేదా బరువును తగ్గించనున్నారు.
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
యుద్ధానికి, బిస్కెట్కు లింక్ ఏంటి..
బిస్కెట్ల తయారీలో వాడే పామ్ ఆయిల్, ప్యాకేజింగ్ మెటీరియల్, రవాణా ఖర్చులు (ఫ్యూయల్) అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల సముద్ర మార్గంలో రవాణా కష్టతరమైంది. దీంతో కంపెనీపై అదనపు భారం పడుతోంది. గోధుమ ధరలు కాస్త తగ్గినా, ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సంస్థ తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో బ్రిటానియా అంతర్జాతీయ ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి విదేశాల్లోనూ ధరలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైంది. సప్లై చైన్ సమస్యలను అధిగమించేందుకు ఒమన్లోని కొన్ని తయారీ యూనిట్లను తిరిగి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు మారుస్తున్నట్లు సంస్థ తెలిపింది.
పోటీ కంపెనీల ఎత్తుగడలు..
గ్రామీణ మార్కెట్లలో బ్రిటానియాకు ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కొన్ని కంపెనీలు రూ.5, రూ.10 ప్యాకెట్లను రూ.4.50, రూ.9 లకే విక్రయిస్తూ రిటైలర్లకు ఎక్కువ మార్జిన్ ఇస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బ్రిటానియా అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇతర కంపెనీలు తిరిగి తమ సాధారణ ధరలకు రాగానే బ్రిటానియా మళ్లీ పుంజుకుంటుందని కంపెనీ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే.. ఇప్పటి నుంచి మీరు కొనే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ అదే ధరకు దొరికినా.. అందులో ఉండే బిస్కెట్లు మాత్రం తక్కువగా ఉండబోతున్నాయి. ఒకవేళ బిస్కెట్లు అంతే ఉండాలంటే, మీరు చెల్లించే ధర పెరుగుతుంది. బ్రిటానియా లాంటి దిగ్గజ సంస్థే ధరలు పెంచడంతో, త్వరలోనే ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!