Axis Bank: స్టాక్ ట్రేడింగ్ స్కామ్ పేరుతో మోసం.. రూ.97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం
- స్టాక్ ట్రేడింగ్ స్కామ్ పేరుతో మోసం
- 97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం
- నిందితులను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో స్టాక్ మార్కెంటింగ్ పేరుతో రూ. 97 కోట్ల కుంభకోణానికి పాల్పడిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మరియు ముగ్గురు సేల్స్ ఎగ్జిక్యూటివ్లతో సహా ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీళ్లంతా స్టాక్ ట్రేడింగ్కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా భారీ రాబడిని సంపాదించవచ్చంటూ ఖాతాదారులను మోసం చేశారు. ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు రూ.97 కోట్లు నొక్కేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ స్కామ్కు సంబంధించి దేశవ్యాప్తంగా 254 కేసులు నమోదైనట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు సిబ్బంది ప్రారంభించిన ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా రూ.97 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. అరెస్టయిన వారిని పశ్చిమ బెంగళూరులోని యాక్సిస్ బ్యాంక్ నాగరభావి బ్రాంచ్లో బ్యాంక్ మేనేజర్ కిషోర్ సాహు, సేల్స్ ఎగ్జిక్యూటివ్లు మనోహర్, కార్తీక్, రాకేష్లుగా పోలీసులు గుర్తించారు. మ్యూల్ అకౌంట్లు నిర్వహించిన లక్ష్మీకాంత, రఘురాజ్, కెంగేగౌడ, మాల సీపీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
ఈ కుంభకోణంపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి ఒక ప్రకటనలో ఇలా అన్నారు. ‘‘ఈ విషయం ప్రస్తుతం విచారణలో ఉంది. ప్రక్రియను వేగవంతం చేయడానికి దర్యాప్తు అధికారులకు యాక్సిస్ బ్యాంక్ పూర్తిగా సహకరిస్తోంది.’’ అని తెలిపారు.
ఉత్తర బెంగళూరులోని యలహంక నివాసి మార్చిలో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. స్టాక్ ట్రేడింగ్ చిట్కాలను అందించిన వాట్సాప్ గ్రూప్లో తనను జోడించారని, ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడికి 10 రెట్లు రాబడి వస్తుందని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!