Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తమ ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో తన దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఇప్పటికే తన అంతర్జాతీయ సర్వీసులను కూడా దాదాపు 27 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా నెట్వర్క్ పరిధిని పరిశీలిస్తే, సంస్థ ప్రతి వారం దాదాపు 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. దేశీయ సర్వీసులు వారానికి సుమారు 3,600 విమానాల, అంతర్జాతీయ సర్వీసులు వారానికి సుమారు 800 విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. వారానికి నడిచే 3,600 దేశీయ విమాన సర్వీసులలో సుమారు 22 శాతం వరకు కోత పడనుంది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన..
ఈ తాత్కాలిక మార్పులపై ఎయిర్ ఇండియా బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్, ఆగస్టు 2026 మధ్య కాలానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులలో కొన్ని సర్దుబాట్లు చేశామని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా కార్యకలాపాలను తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కొన్ని నిర్దిష్ట మార్గాలలో మాత్రమే విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక, మార్కెట్ డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ.. రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది.
Also Read
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
ఇండిగో సంస్థ కూడా జూన్ 1 నుంచి తమ దేశీయ సర్వీసులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంధన ధరల పెరుగుదల, ప్రయాణికుల డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణాలు. ఇండిగో 5-7 శాతం మేర సర్వీసులను కోత విధించనుంది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా వంటి పలు ప్రధాన నగరాల మధ్య నడిచే విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతే కాకుండా.. విమాన ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..