Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తమ ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో తన దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఇప్పటికే తన అంతర్జాతీయ సర్వీసులను కూడా దాదాపు 27 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా నెట్వర్క్ పరిధిని పరిశీలిస్తే, సంస్థ ప్రతి వారం దాదాపు 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. దేశీయ సర్వీసులు వారానికి సుమారు 3,600 విమానాల, అంతర్జాతీయ సర్వీసులు వారానికి సుమారు 800 విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. వారానికి నడిచే 3,600 దేశీయ విమాన సర్వీసులలో సుమారు 22 శాతం వరకు కోత పడనుంది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన..
ఈ తాత్కాలిక మార్పులపై ఎయిర్ ఇండియా బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్, ఆగస్టు 2026 మధ్య కాలానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులలో కొన్ని సర్దుబాట్లు చేశామని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా కార్యకలాపాలను తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కొన్ని నిర్దిష్ట మార్గాలలో మాత్రమే విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక, మార్కెట్ డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ.. రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది.
Also Read
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
ఇండిగో సంస్థ కూడా జూన్ 1 నుంచి తమ దేశీయ సర్వీసులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంధన ధరల పెరుగుదల, ప్రయాణికుల డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణాలు. ఇండిగో 5-7 శాతం మేర సర్వీసులను కోత విధించనుంది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా వంటి పలు ప్రధాన నగరాల మధ్య నడిచే విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతే కాకుండా.. విమాన ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
-
Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!
-
Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
-
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
-
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్కు ‘OG 2’ ఆల్బమ్ అంకితం
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..