Site icon NTV Telugu

బిగ్ బాస్ 5 : ఫైనల్‌కి టిక్కెట్‌ గెలుచుకుంది ఎవరంటే ?

Bigg-Boss-5

Bigg-Boss-5

‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో అంతర్గత తగాదాలు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్ లతో రియాల్టీ షో మరింత ఆసక్తికరంగా మారింది. ‘టిక్కెట్ టు ఫినాలే’ గెలవడానికి పోటీదారుల కోసం ‘బిగ్ బాస్’ మేకర్స్ వరుస గేమ్‌లను ప్రకటించారు. పోటీదారుల ఓర్పు, వేగం, దృష్టి, నైపుణ్యం, ఇతర లక్షణాలను పరీక్షించే టాస్క్‌ల ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లను కఠినంగానే ప్రకటించారు. అయితే ఈ రోజు ఫైనల్ కంటెస్టెంట్‌కి టికెట్ ఎవరికో ఈరోజు ప్రకటించారు.

Read Also : వేప రసం లాంటి నిజం… మెల్లగా దిగుతుంది… నెటిజన్ కు డైరెక్టర్ రిప్లై

ఫైనల్‌కి టిక్కెట్‌ను గెలుచుకున్న కంటెస్టెంట్ గాయకుడు శ్రీరామ్. అన్ని రౌండ్లలో గెలిచి ఫైనల్ కు తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయితే ఆయన ముందుకు వెళ్లలేడు. మరోవైపు శ్రీరామ్‌ ఫైనల్స్‌కు చేరుకోవడంతో ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అధికారిక ఓటింగ్ పోల్స్ లో శ్రీరామ చంద్ర, సన్నీ మంచి ఓటింగ్ ను సంపాదించారు. అయితే సిరి, మానస్ ఒకే విధమైన ఓటింగ్ శాతాన్ని కలిగి ఉండగా… ఎలిమినేషన్స్‌లో కాజల్, ప్రియాంక సింగ్‌లు డేంజర్ జోన్ లో ఉన్నారు.

Exit mobile version