NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: మూడో హౌజ్‌మేట్‌ శోభా శెట్టి..ఎమోషనల్ అయిన రతికా..

Bibb7

Bibb7

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడో వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.. శనివారం ఎపిసోడ్‌లో నాగ్‌ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యాడు.. ఒక్కొక్కరిని పేరు పేరున కడిగిపడేసారు..టేస్టీ తేజ, అమర్‌ దీప్‌, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్‌పై ఏకంగా ఫైర్‌ అయ్యాడు. మొత్తంగా కంటెస్టెంట్లు చేసిన పొరపాట్లని నాగార్జున చెప్పారు. నిలదీశాడు, వారిపై ఫైర్‌ అయ్యాడు.. మూడో హౌజ్‌ మేట్‌ కోసం జరిగే పోటీలో సరిగా వ్యవహరించని సంచాలక్‌ సందీప్‌పై కూడా మండిపడ్డాడు. తన విధులు సరిగా చేయలేకపోయాడని, అర్థం చేసుకోలేకపోయాడని నాగార్జున ఫైర్‌ అయ్యాడు.

అంతేకాదు ఇతర హౌజ్‌ మేట్స్ ని కూడా నిలదీశాడు.. మూడో పవర్ అస్త్ర కోసం జరిగిన పోటీలో ప్రియాంక, శోభ శెట్టి ల మధ్య గట్టి పోటి ఏర్పడింది.. ఇందులో శోభా శెట్టి విన్నర్‌ అయ్యారు. సందీప్‌, శివాజీ తర్వాత శోభా మూడో హైజ్‌ మేట్‌ కావడం విశేషం.. ఆ తర్వాత నాగ్ ఒక్కొక్కరి గురించి అడగగా, యావర్ కు నాలుగు ఓట్లు పడ్డాయి.. గేమ్ చేంజర్ అనే పేరును తెచ్చుకున్నాడు.. మరోవైపు సంచాలక్‌కగా సరైన విధంగా ఆడలేడని, అతనికి రెండు రోజులపాటు జైల్లో ఉండే శిక్ష వేశారు.

ఇందులో రతిక సైలెంట్‌గా ఉందని, గేమ్‌ ఆడటం లేదని బిగ్‌ బాస్‌ తెలిపారు నాగార్జున. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో ఆమె పవర్‌ గ్రీన్‌ నుంచి ఎల్లోకి అట్నుంచి రెడ్‌ సింబల్‌లో కి డౌన్‌ అయిపోతుందని అన్నారు.. ఈ సందర్భంలో రతికా తనకు తన మాజీ లవ్‌ స్టోరీ గుర్తొస్తుందని చెప్పడం విశేషం. ఎక్స్ అంటే అయిపోయిన టైమ్‌ అని, దాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవద్దని, దాన్ని దాటుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు నాగ్.. ఇక ఈ వారం బిగ్ బాస్ ను ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే ఈ వారం బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాలి..