NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: ప్రశాంత్ ను పక్కన పెట్టేసిన రతికా..పవరాస్త్ర కోసం ప్రియాంక కష్టాలు..

Bb7 (2)

Bb7 (2)

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.. మూడో వారం పవర్‌ అస్త్ర సాధించి ఎవరో హౌజ్‌లో కంటెస్టెంట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. గత రెండు వారాల్లో సందీప్, శివాజీ ఈ పవర్ అస్త్ర ను గెలుచుకొని సేఫ్ జోన్ లో ఉన్నారు.. ఇప్పుడు మూడో వారం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇందులో యావర్‌ కంటెండర్‌గా గెలిచాడు. అలాగే అమర్‌ దీప్‌, ప్రియాంక పోటీ పడుతున్నారు. మరోవైపు శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌, శుభ శ్రీ, గౌతం కృష్ణ సైతం కంటెండర్ కోసం పోటీ పడుతున్నారు.

ఇందులో భాగంగా శోభాశెట్టికి చికెన్‌ పీస్‌లు తినే టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. కారంగా ఉన్న పీసులు తిని కన్నీళ్లు పెట్టుకుంది.. 27 పీసులు తినగా, ఆమెని రీచ్ అయ్యేందుకు శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్‌, గౌతంకృష్ణ ల మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో గౌతమ్‌ మొదటగా తిన్నాడు. కానీ పీసులు పూర్తిగా తినకపోవడంతో ఈ టాస్క్ లో ఓడిపోయాడు.. శోభా శెట్టి ఆ టాస్క్ ను పూర్తి చేసి పవర్ అస్త్ర పోటీలోకి దిగింది.. అలాగే అమర్, ప్రియాంక ల మధ్య గట్టి పోటి ఏర్పడింది.. ఇందులో కంటెండర్‌ కావాలంటే జుట్టు కత్తిరించుకోవాలి. ఈ టాస్క్ కి అమర్‌ దీప్‌ గివప్ ఇచ్చాడు. తాను జుట్టు కత్తిరించుకోలేనని తెలిపారు. తనకు అది ప్రాబ్లమ్ అవుతుందన్నారు. దీంతో ప్రియాంక తీసుకుంది. ఆమె శోల్డర్‌ పైకి జుట్టు కత్తిరించుకుంది. దీంతో మూడో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండ్‌గా నిలిచింది. ఇలా ఇప్పుడు యావర్‌, శోభా శెట్టి, ప్రియాంకలు మూడో పవర అస్త్ర కోసం పోటీలో నిలబడ్డారు..

ఇంకోవైపు హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌కి అదే విషయాన్ని చెప్పింది. నామినేషన్‌లోనే కాదు, మామూలు రోజుల్లో కూడా నీలోని ఫైర్‌ని బయటకు తీయాలని తెలిపింది. ఇంకోవైపు ప్రశాంత్‌, రతికల మధ్య మరోసారి పులిహోర వ్యవహారం నడించింది. రతిక ముందు పాట పాడి ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, ఆ పాట ఆమెకు అర్థం కాలేదని పక్కన పెట్టేసింది..ఇక మూడో వారం నామినేషన్స్ లో అమర్‌ దీప్‌, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్‌, రతిక, శుభ శ్రీ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో తెలియాల్సి ఉంది..