తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా మారింది.. మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.. సోమవారం, మంగళవారం నామినేషన్స్ కోసం ప్రక్రియను పూర్తి చేశారు..రెండో వారం షో యమ రంజుగా మారింది. ఉల్టా పుల్టా అన్నట్టుగానే హౌజ్లో కాలిక్యూలేషన్స్ ఉల్టా పుల్టా అవుతున్నాయి..మంగళవారం ఎపిసోడ్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మరోవైపు పవర్ అస్ర్తకి సంబంధించిన మాయాస్త్ర సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఈవారం నామినేషన్ ప్రక్రియ గట్టిగానే సాగింది.. అయితే అత్యధికంగా పల్లవి ప్రశాంత్కి ఎనిమిది ఓట్లు పడ్డాయి. ఓ రకంగా హౌజ్ మొత్తం రైతు బిడ్డని టార్గెట్ చేసింది. తను అమ్మాయిల వెంటపడుతున్నాడని, అసలు గేమ్ ఆడటం లేదని శోభా శెట్టితోపాటు మేజర్ సభ్యులు భావించారు. అయితే గత సీజన్ల ఎపిసోడ్లు చూసి దాన్ని ఫాలో అవుతున్నావని, యాక్టింగ్ చేస్తున్నావని కామెంట్లు చేశారు. అది మానుకోవాలని తెలిపారు. ఒరిజినల్ ఆట ఆడాలని తెలిపారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టారు. మరోవైపు శివాజీ, శోభా శెట్టి విషయంలోనూ గొడవ జరిగింది. ఈ ఇద్దరు గట్టిగానే వాదించుకున్నారు. నువ్వు తోపు అయితే బయట ఇక్కడ కాదని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది శోభా శెట్టి..
ఇదిలా ఉండగా..రెండో వారంలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభాశెట్టి, శివాజీ, తేజ, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ ఈ వారం ఎలిమినేషన్కి సంబంధించి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత మాయాస్త్రని సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. మాయాస్త్ర బిగ్ బాస్ హౌజ్ లోపలే ఉందని, ఏడువేల సంవత్సరాల క్రితం దాన్ని రెండు సముహాలు సాధించి, ఆ పవర్ని మాయాస్త్రలో దాచిపెట్టాయని, దాన్ని సాధించేందుకు ఆ రెండు సముహాలు ఇప్పుడు వచ్చాయని, దాన్ని సాధించాలని తెలిపారు.. అయితే ఈ నామినేషన్స్ కు అందరు ప్రశాంత్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. అయితే చివరి నిమిషంలో బిగ్ బాస్ ఎలాంటి షాక్ ఇస్తాడో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాలిసిందే…