స్టార్ మా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ లో సెకండ్ లాంచ్ ఈవెంట్ డే లో వరుస షాక్ లు ఇస్తున్నారు.. ఊహించని ట్విస్ట్ లు కూడా ఇస్తున్నారు.. ఎలిమినేషన్ తో మొదలైంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిని నాగార్జున డార్క్ రూమ్ కి పంపాడు.. ఆ రూమ్ లో ఒక దెయ్యం కూడా వస్తుంది.. ఎవరు ఎలిమినేట్ అయితే వారిని ఎత్తుకు పోతుంది.. ఇక నాగార్జున శుభశ్రీని వేదికపైకి ఆహ్వానించాడు. ఆమె ఇంటి సభ్యులతో గుడ్,బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పి వేదిక వీడింది. అయితే నామినేషన్స్ లో మరో ఆరుగురు కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు..
జనాల ఓట్ల వల్ల బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక, శివాజీ, యావర్, అమర్ దీప్ వరుసగా సేవ్ అయ్యారు. ఇక గౌతమ్-తేజాలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు. సేవ్ అయిన నలుగురితో పాటు సందీప్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి హౌస్ మేట్స్ అయ్యారు. గౌతమ్-తేజాలలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఈ ఏడుగురు హౌస్ మేట్స్ నిర్ణయిస్తారని చెప్పి షాక్ ఇచ్చాడు.. ఒక్కరు మాత్రమే తేజ కు వ్యతిరేకంగా ఎర్రనీళ్లు పోస్తే.. మిగిలిన వారంతా కూడా గౌతమ్ వద్దని ఎలిమినేట్ అవ్వాలని ఎర్రనీళ్లు పోస్తారు..
నాగార్జున గౌతమ్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఇంట్లో ఉన్న 8 మంది హౌస్ మేట్స్ లో ఫేక్ ఎవరు? రియల్ ఎవరో చెప్పాలని గౌతమ్ ని నాగార్జున అడిగారు. తేజా, యావర్ తప్పితే అందరిలో ఫేక్ నెస్ ఉందని చెప్పాడు.. ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన నాగార్జున గౌతమ్ ని వెనక్కి పిలిచి ట్విస్ట్ ఇచ్చాడు. నువ్వు ఎలిమినేట్ కాలేదు. నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడు సీక్రెట్ రూమ్ కి వెళుతున్నావు. అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది బిగ్ బాస్ చెబుతాడు నాగ్.. దానికి సంతోషంగా ఫీల్ అవుతాడు.. గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు.. రేపు ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి..