NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: గౌతమ్ సాధించాడు.. అమర్, శోభా శెట్టి మధ్య గొడవపెట్టిన గేమ్..

Shobha

Shobha

బిగ్ బాస్ లో నాలుగో పవర్ అస్త్ర కోసం గట్టి పోటి సాగుతుంది..ఎవ్వరు తగ్గట్లేదు.. నువ్వా, నేనా అంటూ గేమ్ ను ఆడుతున్నారు.. ఇందుకోసం హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ లోని వాళ్లు తెగ ట్రై చేశారు..ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో తేజ, గౌతమ్, శుభ శ్రీ, రతికా, ప్రియాంక ఉన్నారు. వీరి నుంచి ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు..

గత ఎపిసోడ్ లో హౌస్ ను బ్యాంక్ గా మార్చారు.. అందులో భాగంగా కొన్ని కాయిన్స్ ను శోభా, శివాజీ, సందీప్ కు ఇచ్చి మీకు నచ్చిన వారికి ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు..ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కబెట్టి వాటిని తమ లాకర్లు లో దాచాలని చెప్పారు. ఆతర్వాత ఆడే గేమ్స్ ను బట్టి తమ దగ్గరున్న కాయిన్స్ పెంచుకోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుందనిచెప్పాడు బిగ్ బాస్ దాంతో అందరు బ్యాంకర్లను బ్రతిమిలాడుకునే పనిలో పడ్డారు. ఆతర్వాత ఏటీఎమ్‌ దగ్గర ఉన్న బజర్‌ను ఫస్ట్ ఎవరు ప్రెస్ చేస్తే. బారు తన పార్టనర్‌తో పాటు, ఆపోజిట్ జంటను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు..

ఇక ముందుగా అమర్ దీప్ బజార్ ప్రెస్ చేశాడు. దాంతో అతను తన పార్టనర్‌ గా గౌతమ్ ను ఎంచుకున్నాడు. అపోజిట్ టీమ్ గా రతికా, తేజలను ఎంచుకున్నాడు. వీరికి ఓ టాస్క్ ఇచ్చాడు. గేమ్ ఏంటంటే.. ఒక జంట నవ్వుతూ ఫొటోలు దిగకుండా మరో టీమ్ అడ్డుకోవాలి.. అలా అడ్డుకున్నా ఎక్కువ స్మైల్ ఫోటోలు ఎవరు బాగా తీసుకుంటే వారు విన్నర్స్..ఈ గేమ్‌లో రెండు జంటలు గట్టిగానే ఆడాయి. రతికా, తేజ అమర్ గౌతమ్ లను బాగానే అడ్డుకున్నారు. ఈ గేమ్ లో ఫొటోగ్రాఫర్‌గా శివాజీ, సంచలక్ గా సందీప్ ఉన్నారు. శోభా ప్రతి ఫొటోను పరిశీలించి ఎవరు విన్ అయ్యారో తెలిపింది. ఈ గేమ్ లో అమర్ దీప్ గౌతమ్ విన్ అయ్యారు. అంతకు ముందు శోభా శెట్టికి , అమర్ కు మధ్య గొడవ జరిగింది. బాక్స్ లో ఉండి ఫోటోలు దిగాలి అని శోభా, అమర్ గొడవ పడ్డారు.. మొత్తంగా అమర్, గౌతమ్ బాగా ఆడారు.. గౌతమ్ మొత్తానికి అనుకున్నది సాధించాడు..మరి రేపటి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..