Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Funeral Traditions: హిందూ సంప్రదాయంలో మరణానంతరం నిర్వహించే అంత్యక్రియలకు సంబంధించి అనేక నమ్మకాలు, శాస్త్రోక్తమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా హిందువులు మృతదేహాన్ని దహనం చేస్తారు, కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే మాత్రం పాతిపెట్టడం మనం చూస్తుంటాం. అసలు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటో ఈ ప్రత్యేక స్టోరీలో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. మనిషి మరణించిన తర్వాత శరీరాన్ని అగ్ని సంస్కారం చేయడం ద్వారా ఆత్మకు భౌతిక బంధాల నుంచి విముక్తి కలుగుతుందని, శరీరం పంచభూతాలలో విలీనం అవుతుందని నమ్ముతారు. అయితే చిన్నపిల్లల విషయంలో ఈ సంప్రదాయం భిన్నంగా ఉంటుంది.
Also Read
- Mercury transit 2026: మే 29న అరుదైన "సరస్వతి యోగం".. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
శాస్త్రాల ప్రకారం.. చిన్నపిల్లలు అత్యంత స్వచ్ఛమైన మనసు కలిగినవారు. వారు జనన మరణ చక్రంలో చిక్కుకునేలా చేసే ఎలాంటి పాపపుణ్యాలు లేదా కర్మలు చేసి ఉండరు. వారి ఆత్మలు అప్పటికే పవిత్రంగా, స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వారిని అగ్నితో ప్రత్యేకంగా పవిత్రం చేయవలసిన అవసరం లేదని పండితులు చెబుతుంటారు. గరుడ పురాణం ప్రకారం.. పాలపళ్లు రాని లేదా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలను దహనం చేయకూడదు. ఈ వయస్సు పిల్లల్లో ‘నేను’, ‘నాది’ అనే అహంకారం లేదా ప్రాపంచిక బంధాలు ఏర్పడవు.
ఆధ్యాత్మికంగా మనిషికి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. పెద్దవారిలో ఈ మూడు శరీరాల మధ్య బంధం బలంగా ఉంటుంది, దానిని వేరు చేయడానికి అగ్ని సహాయం అవసరం. కానీ పిల్లల్లో ఈ బంధం చాలా బలహీనంగా ఉండటం వల్ల వారి ఆత్మలు సులభంగా శరీరాన్ని విడిచిపెడతాయి. చిన్నపిల్లల శరీరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా వారి తల పైభాగంలో ఉండే ‘బ్రహ్మరంధ్రం’ పూర్తిగా మూసుకుపోయి ఉండదు. దీనివల్ల ప్రాణశక్తి సహజంగానే సులభంగా బయటకు పోతుంది. అందుకే పెద్దవారికి చేసే ‘కపాల క్రియ’ (తల మీద కొట్టడం) వంటి కఠినమైన ప్రక్రియలు పిల్లలకు అవసరం ఉండదు. శరీరం పంచభూతాలతో నిర్మితమవుతుంది. పిల్లల శరీరం ప్రకృతికి అత్యంత సన్నిహితంగా పరిగణించబడుతుంది. అందుకే వారిని నేరుగా మట్టికి (భూమికి) అర్పించడం అత్యంత సహజమైనదిగా భావిస్తారు.
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..