మన భారతీయులు తులసిని అమ్మవారుగా కొలుస్తారు.. పెళ్ళైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి పూజలు చేస్తారు.. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి మొక్కను ప్రతి గురువారం రోజు ప్రత్యేకించి పూజించడం వల్ల అదృష్టం దశ తిరుగుతుంది అంటున్నారు పండితులు. డబ్బులతో మీ ఖజానా నిండిపోతుంది. తెలుగోళ్లకు తులసి మొక్కకు విశిష్టత ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా పెంచుకుంటూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం పూజలు చేసి నీరు అభిషేకిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యి సుఖ సంతోషాలు కలిగేలా చేస్తుందని భక్తుల విశ్వాసం…
మాములుగా ఏ నెలలో అయిన కూడా శుక్లపక్షం గురువారం రావి చెట్టు దగ్గరకు వెళ్లి నాలుగు ఆకులను తీసుకొని వాటికి చందనం లేపనం రాసి నదిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల సంపద లభిస్తుంది. అదేవిధంగా గురువారం రోజు పుణ్యా నక్షత్రంలో గోరోచనాన్ని వెండిడబ్బాలో ఉంచి ధూపం వదిలి సింధూరం పెట్టి ఖజానాలో ఉంచాలి. ఇలా చేస్తే డబ్బులకు కొదవ ఉండదు. అలాగే ప్రతి గురువారం నాడు తులసి మొక్కకు పాలు పోయడం వల్ల ఆ ఇంట్లో ధన సంపదలు వచ్చి పడతాయి.. ఇకపోతే ప్రతి గురువారం పసుపు గుడ్డని తీసుకొని తులసి మొక్క చుట్టు ఉండే గడ్డిని తీసుకొని ఆ గుడ్డలో చుట్టి ఖజానా దాస్తున్న దగ్గర ఉంచితే డబ్బులకు లోటు ఉండదు.. ప్రతి గురువారం నాడు పుణ్య నక్షత్రంలో పసుపుకు ధూపమిచ్చి ఎర్రటి వస్త్రంలో చుట్టి ఖజానాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఖజానాలో డబ్బు నిరంతరం పెరుగుతూ ఉంటుంది.. అలాగే దరిద్రాలు పోయి సుఖ సంతోషాలు వెల్లు వెల్లువిరుస్తుందని పండితులు చెబుతున్నారు..