NTV Telugu Site icon

Vinakayaka Statues: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం.. ఏ జిల్లాలో ఉందంటే?

Tg

Tg

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సారి కొన్ని వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా.. దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

READ MORE: Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..

నాగర్ కర్నాల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో ఈ గణేషుడి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా పేరుంది. ఈ గణేషుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా.. వెడెల్పు 15 అడుగులు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ ప్రకారం .. సుమారు 879 ఏండ్ల కిందట అంటే క్రీ.శ 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలవబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. మహబూబ్ నగర్ జిల్లా అవంఛ గ్రామా శివారుల్లో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందకు జనాలు గుంపులు గుంపులుగా తరలి వస్తు్న్నారు. ఇదిలా ఉండగా.. కళ్యాణ చాళుక్యుల కాలంలోనే క్రీస్తు శకం 11 శతాబ్దంలో చెక్కిన మరొక విగ్రహం, సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి గ్రామంలో ఉంది. ఆనాటి పాలకులు, హిందూ మతానికి, శిల్ప సౌందర్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఈ శిల్పాల్లో కనపడుతుంది.