Siva Pooja: శివుడికి ఇలా పూజ చేస్తే.. అదృష్టం మీ తలుపు తట్టినట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి… అలాగే మీ ఇంటి ఖజానా ఎల్లప్పుడూ నిండుగా ఉండటానికి సోమవారం రోజున 1.25 కిలోల బియ్యాన్ని తీసుకోండి. అందులో కొంత శివుని ఆలయంలో సమర్పించండి. మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ ధనప్రవాహం ఉంటుంది..ఆర్ధిక ఇబ్బందులు రావు..
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ఈ రోజున మీరు ఇంట్లో కొమ్ములు లేని జింక ఫోటోను ఉంచాలి. ఈ జింక మృగశిర రాశిని సూచిస్తుంది. ఈ ఫోటోను ఇంట్లో ఉంచుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఇక అలాగే మీ కెరీర్ కోసం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోలేకపోతే ఈ రోజున మీరు శివలింగానికి ఎర్రటి పువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ‘ఓం’ అనే శబ్దాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీరు కెరీర్లో పురోగతిని పొందుతారు.. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు రావు.. వ్యాపారాభివృద్ధికి ఈరోజు ఐదు రకాల రంగోలి పొడులు తీసుకుని సాయంత్రం పూట శివాలయానికి వెళ్లి ఆ రంగులతో చిన్న గుండ్రని ముగ్గు వేసి ఈ రంగోలి మధ్యలో నెయ్యి దీపం వెలిగించండి.
మీ వ్యాపారంలో విజయం, అభివృద్ధి కోసం దేవుడిని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం పెరుగుతుంది.. లాభాలే వస్తాయి.. మనం ఎంత సంపాదించిన ఆరోగ్యంగా ఉండటం మంచిది.. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆరోగ్యం, జీవితం కోసం ఈ రోజున స్నానం మొదలైన తర్వాత మీ ఇంటికి సమీపంలోని ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు ,గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించండి. ఇలా నిత్యం చెయ్యడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.. అలాగే కుటుంబంలో సంతోషం వెల్లు విరుస్తుంది..
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?