Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.

  • జూన్ 11న పరమ ఏకాదశి..
  • విష్ణువు అనుగ్రహం కోసం ఈ తప్పులు అస్సలు చేయకండి..
Ekadashi

Ekadashi

Parama Ekadashi: హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ప్రతీ మూడేళ్లకు ఒకసారి వచ్చే ఏకాదశి ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. దీనినే ‘‘పరమ ఏకాదశి’’గా పిలుస్తారు. జూన్ 11న ఈ మహత్తర గడియలు రాబోతున్నాయి. ఇది అధిక మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వల్ల ఒక వ్యక్తి అనేక జన్మల పాపాల నుంచి విముక్తి అవుతాడనే నమ్మకం ఉంటతుంది. పేదరికం, ఆర్థిక నష్టాలు తొలిగిపోతాయని చెబుతుంటారు. ఈ ఏడాది జూన్ 11న పరమ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. అయితే, ఈ ఏకాదశి రోజున చాలా నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు చేసిన వ్రత ప్రయోజనాలు లభించవు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. పరమ ఏకాదశి వ్రతం ఆచరించే వ్యక్తికి ఈ జీవితంలో సుఖం లభించడమే కాకుండా మోక్షమార్గం కూడా లభిస్తుందని చెబుతారు. అయితే ఈ వ్రతం ఎంత ప్రాముఖ్యమైనదో, దాని నియమాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. ఒక చిన్న పొరపాటు కూడా వ్రతం యొక్క ప్రయోజనాలను తగ్గిస్తుందని అంటారు. అందువల్ల, విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులను

పరమ ఏకాదశి నాడు ఈ తప్పులు అసలే చేయకండి..

1) తులసి ఆకులను లేదా మరే ఇతర మొక్కను గానీ కోయవద్దు.
ఈ రోజున తులసి ఆకులను కోయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. పూజ కోసం తులసి ఆకులను ఒక రోజు ముందుగానే కోయడానికి ప్రయత్నించండి.

×
×
Ad

2) ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఇల్లు శుభ్రం చేసేటప్పుడు చీమలకు లేదా ఇతర చిన్న జీవులకు హాని కలగకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజున అహింసను పాటించడం చాలా ముఖ్యం.

3) దశమి తిథి నుండి నియమాలను పాటించాలి.
ఉపవాసం పాటించేవారు ముందు రోజు, అంటే దశమి తిథి నుండే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

4) ఉప్పును తినొద్దు.
ఏకాదశి రోజున సాధారణ ఉప్పు తినడం నిషేధంగా చెబుతారు. తప్పనిసరి అయితే, ఉప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు.

5) ఈ ఆహారాలను మానుకోండి:
ఈ రోజున అన్నం, పప్పులు, ముల్లంగి, వంకాయలను తినకూడదు. నియమాలు ప్రత్యేకంగా అన్నం తినవద్దని చెబుతున్నాయి.

6) తిట్టడం, చెడు విషయాలకు దూరంగా ఉండండి.
ఒకరి గురించి చెడుగా మాట్లాడటం లేదా మనసులో ప్రతికూల ఆలోచనలు తెచ్చుకోవడం ఉపవాసం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. తిట్టడం, కోపం, ద్వేషం వంటివి మానుకోండి.

7) పగటిపూట నిద్రపోవడం మానుకోండి.
ఉపవాసం పాటించేవారు పగటిపూట నిద్రపోవడం మానుకోవాలి. వీలైతే, రాత్రిపూట మేల్కొని దేవునికి స్తోత్రాలు పాడండి, ఇది ఉపవాస ప్రయోజనాలను మరింత పెంచుతుంది.

ఏం చేస్తే మంచింది..

భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవార్లను ప్రార్థించిండి. వీలైనంత ధ్యానం చేయండి. ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి రజోగుణాలు దరి చేరనివ్వద్దు. ఉపవాసం పాటించాలి. దానధర్మాలు చేస్తే మంచింది. బ్రహ్మణులకు పాదరక్షలు, ఇతర ఉపయోగకరమై వస్తువుల్ని దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.