దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. ఈ నవరాత్రుల్లో ఆయుధ పూజ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.. ఇక తెలంగాణాలోని అత్యంత మహిమాన్వితమైన ఆలయాల్లో ఒకటి.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం.. అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని కోరికలను కోరుకుంటున్నారు.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తుల పూజలను అందుకుంటుంది పెద్దమ్మ తల్లి..
ఈ నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. పది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది.. అమ్మవారు 15 నుంచి 23 వరకు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు.
ఈరోజు పెద్దమ్మ తల్లి శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు.. ఈరోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఈరోజు అమ్మవారు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. పాయసం, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. పూల మాలలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి అఖండ కీర్తి, సౌభాగ్యం కలుగుతుంది. దశమి రోజు ఆయుధ పూజ చేసేవారు అక్టోబరు 24 మంగళవారం సూర్యోదయానికి దశమి తిథి ఉండడంతో ఆ రోజు చేస్తారు..
