Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..
- నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం..
- కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం..
- తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో భక్తులు శివకేశవులను పూజిస్తారు. సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఈ నెల 4న తొలి కార్తీక సోమవారం రానుంది. కార్తీక సోమవారాల్లో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. కాగా, కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
Read also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..
Also Read
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కార్తీకశోభ సంతరించుకుంది. డిసెంబర్ 1 వరకు నెల రోజులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఆలయంలో ఆలయ అధికారులు లక్షబిల్వార్చన పూజలకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు సాయంత్రం సాముహిక దీపాలంకరణ ఉంటుంది.
* కార్తీకమాసంలో 4న,11,18,25న ,కార్తీక పౌర్ణమి15 న ఆలయంలో సాముహిక సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు.
* 12 నుండి 15 వరకు పంచరత్నాల్లో భాగంగా గోదావరి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్న అధికారులు తెలిపారు.
* 14న వైకుంఠ చతుర్దశి సందర్భంగా రాత్రి 11గం. స్వామివార్లకు క్షీరాభిషేకం,లింగోధ్బవ పూజ
* 15 న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం సత్యనారయణస్వామి వ్రతం,రాత్రి 7 గం.జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
మరోవైపు నేటి నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభమైంది. ఈరోజు నుంచి నెల రోజుల పాటు సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో గంగా హారతి నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉగ్ర యోగ లక్ష్మీ నరసింహస్వామి వార్లకి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగనున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటినుండి నెలరోజుల పాటు కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నాలుగు సోమవారాలు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన జరగనుంది. 15న కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణం, రాత్రి మహా పూజ నిర్వహించనున్నారు. కార్తీక మాసం నెలరోజుల పాటు రాజన్న ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం సామూహిక కార్తీక దీపోత్సవం ఉంటుంది.
మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నుంచి శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదలి శివాలయల్లో ప్రత్యేక అభిషేకాలు భక్తులు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..