Hyderabad Bonalu: బోనం ఆధ్యాత్మిక సంబురం.. ఆరోగ్య రహస్యం కూడా..
- జూలై 6న ఆషాడమాసం ప్రారంభం..
- జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభం..
- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ..
- ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Bonalu: మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది. పంచభూతాలతో రూపొందించబడిన ఈ శరీరాన్ని మానవాతీత శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. అందుకే జననం, జీవితం, మరణం అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక ఎన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నా అంతుచిక్కని సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని పూజించే రోజు బోనాలు. జూలై 6న ఆషాడమాసం ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కొత్త కుండలో సగానికి సున్నం, పైభాగానికి నూనె రాసి, పసుపు, కుంకుమలు పూసి, చందనం పూస్తారు. ఘటాన్ని అన్నంతో నింపి, దాని చుట్టూ మామిడి, వేప ఆకులతో దండలు వేస్తారు. ఘటంపై దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి చుట్టుపక్కల అందరితో కలిసి వెళ్లి బోనం సమర్పిస్తారు.
Read also: B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే..?
Also Read
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఆషాడం అంటే వర్షాకాలం ప్రారంభం… చిన్న చిన్న గుంతలు కూడా నీటితో నిండిపోతాయి. దీంతో తీవ్రమైన జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే సమయం. అంటు వ్యాధులు వైరస్ల ద్వారా వ్యాపిస్తాయి. వైద్య శాస్త్రం పరిణతి చెందని కాలంలో ప్లేగు, కలరా, మశూచి వంటి మహమ్మారి బారిన పడి పిట్టల్లా చనిపోతున్నారు. దానినే గత్తర వచ్చింది అని చెప్పేవారుఈ విపత్తుల నుండి రక్షించాలని అమ్మవారిని పూజిస్తారు. ఊరు వాడను శుభ్రం చేయడం వల్ల సగం క్రిములు తరిమికొడితే… వేపాకు, పసుపు నీళ్లతో ఇన్ఫెక్షన్లను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ప్రతి లోగిలి ముందు కల్లాపి చల్లడం, ముగ్గులు వేయండం వేపాకులు, పసుపు రాసుకోవడం వల్ల క్రిములు తొలగిపోతాయి. బోనం పాత్రలో బియ్యం, ఉల్లి, మిరియాలు, పరమానం వేసి మూతపెట్టి నూనె పోసి దీపం వెలిగించాలి. వంశం సుభిక్షంగా ఉండాలని, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలని సాక పోస్తారు. మశూచి వంటి వ్యాధుల నుంచి కాపాడుతుందంటారు.
Oily Skin Makeup Tips: జిడ్డు చర్మం ఉన్న అమ్మాయిలు ఇలా మేకప్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!