Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhika Masa Purnima: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధిక మాస పౌర్ణమికి ఆధ్యాత్మికంగా మరింత విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర తిథి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు, దాన కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.
తిథి వేళల వివరాలు ఇవే..
క్యాలెండర్ ప్రకారం.. పౌర్ణమి తిథి మే 30వ తేదీ (నిన్న) ఉదయం 11:57 గంటలకే ప్రారంభమైంది. ఇది ఈరోజు (మే 31) మధ్యాహ్నం 2:14 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజు సూర్యోదయంతో పౌర్ణమి తిథి కూడి ఉండటంతో, స్నాన – దాన కార్యక్రమాలకు ఈ రోజే అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
Also Read
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
- Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వద్దన్నా డబ్బు వస్తుంది!
- Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
స్నానాలకు శుభ ముహూర్తాలు..
పౌర్ణమి రోజున నదీ స్నానానికి బ్రహ్మ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4:03 గంటల నుంచి 4:43 గంటల వరకు ఉన్న బ్రహ్మ ముహూర్తంలో భక్తులు గంగానదితో పాటు ఇతర పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే తెల్లవారుజామున 4:33 గంటలకు స్టార్ట్ అయిన అమృత కాలం ఉదయం 6:20 గంటల వరకు కొనసాగింది. ఈ సమయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు చేశారు. ఒకవేళ ఉదయం స్నానం చేయలేకపోయిన వారు.. మధ్యాహ్నం 11:57 గంటల నుంచి 12:51 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా పవిత్ర స్నానాలు ఆచరించవచ్చని చెబుతున్నారు.
దానాలు చేయడానికి ఉత్తమ సమయం ఇదే
అధిక మాస పౌర్ణమి రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజు దానం చేయడానికి ఉదయం 8:51 గంటల నుంచి 10:35 గంటల మధ్య సమయం అత్యంత అనుకూలమైనదిగా నిర్ణయించారు. ఈ పవిత్ర దినాన మీ శక్తి సామర్థ్యాల మేరకు ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదం అని జ్యోతిష్యులు అన్నారు. బియ్యం, పప్పులు, పిండి, బెల్లం, నెయ్యి, పాలు, మామిడి పండ్లు లేదా అరటిపండ్లు, దుస్తులు, గొడుగు, నీటితో నింపిన మట్టి కుండ.
అధిక మాస పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే..
హిందూ పురాణాల ప్రకారం.. అధిక మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే ఈ మాసానికి ఆయన తన పేరైన ‘పురుషోత్తమ మాసం’ అని నామకరణం చేశారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కాలంలో చేసే స్నానం, జపం, తపస్సు, పూజలు, దానధర్మాలకు సాధారణ రోజుల కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!