Mahindra sales: మహీంద్రా కంపెనీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మహీంద్రా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ ఎస్యూవీ, వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను సైతం పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయి. తమ వాహనాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. కానీ.. మోడల్స్ వారీగా కొత్త ధరలను మాత్రం ప్రకటించలేదు. అంతేకాదు.. తమ మొత్తం పోర్ట్ఫోలియోలో సగటు ధర పెరుగుదల 1.6%గా ఉందని ఆ బ్రాండ్ వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన XUV 7XO ధరలో ఎలాంటి మార్పు లేదు. 40,000 డెలివరీలు పూర్తయ్యే వరకు ఈ కారు ధరను పెంచబోమని కంపెనీ ప్రకటించింది. మరోవైపు, మహీంద్రా XUV 7XO 40,000 యూనిట్లు అమ్ముడైన తర్వాత దాని ధర పెరగనుంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.13.66 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.07 లక్షల వరకు ఉంది.
READ MORE: PMSBY: రూ.20కి రూ.2 లక్షలు.. ఈ పథకం మీకు తెలుసా?
స్కార్పియో-ఎన్, థార్, థార్ రాక్స్, ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల ధరలు మాత్రం పెరిగాయి. అయితే.. ఎలక్ట్రిక్ కార్లు కొనే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. వాటి ధరలను స్థిరంగా ఉంచింది. ఇదిలా ఉండగా.. గత మార్చి నెలకు సంబంధించి అమ్మకాల గణాంకాలను సైతం కంపెనీ ప్రకటించింది. మార్చిలో మొత్తం 99,969 వాహనాలను విక్రయించగా, వాటిలో 21% ఎగుమతులు జరిగాయి. కంపెనీ దేశీయ మార్కెట్లో 60,272 యుటిలిటీ వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 62,109 యూనిట్లుగా ఉన్నాయి.
READ MORE: Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..
