Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra sales: మహీంద్రా కంపెనీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మహీంద్రా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ ఎస్యూవీ, వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను సైతం పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయి. తమ వాహనాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. కానీ.. మోడల్స్ వారీగా కొత్త ధరలను మాత్రం ప్రకటించలేదు. అంతేకాదు.. తమ మొత్తం పోర్ట్ఫోలియోలో సగటు ధర పెరుగుదల 1.6%గా ఉందని ఆ బ్రాండ్ వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన XUV 7XO ధరలో ఎలాంటి మార్పు లేదు. 40,000 డెలివరీలు పూర్తయ్యే వరకు ఈ కారు ధరను పెంచబోమని కంపెనీ ప్రకటించింది. మరోవైపు, మహీంద్రా XUV 7XO 40,000 యూనిట్లు అమ్ముడైన తర్వాత దాని ధర పెరగనుంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.13.66 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.07 లక్షల వరకు ఉంది.
READ MORE: PMSBY: రూ.20కి రూ.2 లక్షలు.. ఈ పథకం మీకు తెలుసా?
Also Read
- Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
- Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
స్కార్పియో-ఎన్, థార్, థార్ రాక్స్, ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల ధరలు మాత్రం పెరిగాయి. అయితే.. ఎలక్ట్రిక్ కార్లు కొనే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. వాటి ధరలను స్థిరంగా ఉంచింది. ఇదిలా ఉండగా.. గత మార్చి నెలకు సంబంధించి అమ్మకాల గణాంకాలను సైతం కంపెనీ ప్రకటించింది. మార్చిలో మొత్తం 99,969 వాహనాలను విక్రయించగా, వాటిలో 21% ఎగుమతులు జరిగాయి. కంపెనీ దేశీయ మార్కెట్లో 60,272 యుటిలిటీ వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 62,109 యూనిట్లుగా ఉన్నాయి.
READ MORE: Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..
తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!