Increase Vehicle Prices: వాహన ధరలు పెంచనున్న జేఎస్డబ్ల్యూ ఎంజీ ..జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి
- ముడి సరుకుల ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం
- ఈ ధరలు వివిధ మోడళ్లపై భిన్నంగా ఉండనుందన్న యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు మరియు ఆటోమోటివ్ రంగంపై ప్రభావం చూపుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాహన ధరలను పెంచనున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. కంపెనీ తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో గరిష్టంగా 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది.
ఈ పెంచిన ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ధరల పెంపు మోడల్, వేరియంట్ను బట్టి భిన్నంగా ఉండనుందని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు ఈ ధరల మార్పును గమనించాలని జేఎస్డబ్ల్యూ ఎంజీ సూచించింది.
Also Read
- Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్లు ప్రారంభం, లాంచ్కు సిద్ధమైన కియా
- Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
- Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్లో ఉన్న ఫీచర్లు ఇవే!
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్కు గుడ్ బై.. 100% ఇథనాల్తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
ఈ ధరల పెంపు ఎంజీ బ్రాండ్కు చెందిన పలు ప్రముఖ మోడళ్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా బ్రాండ్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనం విండ్సర్ EV కూడా ఈ జాబితాలో ఉంది. ఈ మోడల్ ధరలు సుమారు రూ.30,000 నుంచి రూ.37,000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జేఎస్డబ్ల్యూ ఎంజీతో పాటు మెర్సిడెస్-బెంజ్, BYD వంటి ఇతర ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా కొత్త సంవత్సరం నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో 2026 ప్రారంభం నుంచే వాహన కొనుగోలుదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!