Increase Vehicle Prices: వాహన ధరలు పెంచనున్న జేఎస్డబ్ల్యూ ఎంజీ ..జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి
- ముడి సరుకుల ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం
- ఈ ధరలు వివిధ మోడళ్లపై భిన్నంగా ఉండనుందన్న యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు మరియు ఆటోమోటివ్ రంగంపై ప్రభావం చూపుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాహన ధరలను పెంచనున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. కంపెనీ తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో గరిష్టంగా 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది.
ఈ పెంచిన ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ధరల పెంపు మోడల్, వేరియంట్ను బట్టి భిన్నంగా ఉండనుందని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు ఈ ధరల మార్పును గమనించాలని జేఎస్డబ్ల్యూ ఎంజీ సూచించింది.
Also Read
- Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
- Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
- టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
ఈ ధరల పెంపు ఎంజీ బ్రాండ్కు చెందిన పలు ప్రముఖ మోడళ్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా బ్రాండ్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనం విండ్సర్ EV కూడా ఈ జాబితాలో ఉంది. ఈ మోడల్ ధరలు సుమారు రూ.30,000 నుంచి రూ.37,000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జేఎస్డబ్ల్యూ ఎంజీతో పాటు మెర్సిడెస్-బెంజ్, BYD వంటి ఇతర ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా కొత్త సంవత్సరం నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో 2026 ప్రారంభం నుంచే వాహన కొనుగోలుదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..