తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరి కొందరు కొత్త జడ్జీలు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి సిఫార్సు చేసింది..
ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఎక్కువగా రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ప్రభుత్వాలు మారినప్పుడు ఒకరిద్దరు ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇబ్బందులు పడటం, వివాదాల్లో ఇరుక్కోవడం గతంలో కూడా ఉన్నా... ఇప్పుడు అదే పెద్ద వ్యవహారంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
కోట్ల సూర్య ప్రష్రెడ్డి... ఏపీ పాలిటిక్స్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. గతంలో కాంగ్రెస్ తరపున 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబం కోట్లది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సూర్య ప్రకాష్రెడ్డి. తర్వాత 2024 ఎన్నికల్లో డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారాయన.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1040 ఎత్తిపోతల పథకాలకు కనీసం మరమ్మతులు చేపట్లేదని విమర్శించారు. అందుచేత సగం ఎత్తిపోతల పథకాలు మూలం పడ్డాయని అన్నారు.
పరామర్శల పేరిట ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. మిగతావాటి వ్యవహారం, చుట్టూ మసురుకున్న వివాదాల సంగతి పక్కనబెడితే.... రైతుల కోసం చేస్తున్న పరామర్శ యాత్రలకు మాత్రం స్పందన బాగుందన్న అభిప్రాయం పెరుగుతోందట పార్టీ సర్కిల్స్లో. ముందు గుంటూరు మిర్చి యార్డ్కు, ఆ తర్వాత పొగాకు రైతుల కోసం ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళారాయన. ఆ రెండు పర్యటనలు సక్సెస్ అన్న రిపోర్ట్ రావడంతో...ఇప్పుడిక మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు సిద్ధమైనట్టు చెబుతున్నారు.
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలని ఆకాక్షించిన ఆయన.. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలన్నారు.. ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు.. లేదా, ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను.. కుప్పంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్మూలా అని స్పష్టం…
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్ తగిలింది.. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న కాకాణికి మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెంలో దొరికిన మద్యం డంపు కేసులో ఆయన నిందితులుగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు పీఈ వారెంట్ పై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారింది.. 2019 నుంచి 2024 వరకు వైసిపి హయాంలో పలు జిల్లాలకు ఎస్పీగా పని చేసిన సిద్ధార్థ కౌశల్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఏఐజి గా లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్నారు. దీంతో సడన్ గా ఆయన విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయటం పై రకరకాల చర్చ జరుగుతోంది. వీఆర్ఎస్ తన వ్యక్తిగత నిర్ణయం అని సిద్ధార్థ…