Site icon NTV Telugu

బిపిన్ రావత్ కు నివాళులర్పించిన వైసీపీ ఎంపీ…

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణికి నివాళులర్పించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వంగా గీత. దీని గురించి ట్విట్టర్ లో తెలుపుతూ… మా పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ తరపున సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు నివాళులర్పించాం. బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబం మొత్తం దేశ సేవలోనే పని చేసింది. బిపిన్ రావత్ తండ్రి కూడా లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు అని పేర్కొన్నారు. త‌మిళ నాడులో జ‌రిగిన హెలి కాప్ట‌ర్ ప్ర‌మాదంలో… బిపిన్ రావత్ తో కలిపి మొత్తం 13 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే భారత త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి.

Exit mobile version