Ummareddy: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరవుతారు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 8, 9 తేదీల్లో నిర్వహించే వైసీపీ ప్లీనరీకి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో గ్రౌండ్ను వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మండలి చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని.. పార్టీ నేతలందరూ ఏం చేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలి అన్న చర్చ ప్లీనరీలో జరుగుతుందని తెలిపారు. భవిష్యత్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ప్లీనరీ తీర్మానాలు ఉంటాయన్నారు. పార్టీలో వివిధ వర్గాల అభిప్రాయం చెప్పే వేదిక ప్లీనరీ అని ఉమ్మారెడ్డి వివరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవి అమలు చేశామని స్పష్టంగా ప్లీనరీలో చెప్తామన్నారు. ప్లీనరీకి గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరవుతారని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో వేరే ఆలోచన అవసరం లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడు అనే సవరణ చేస్తే విజయమ్మ కూడా శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారని తెలిపారు. ఈ అంశం పై సీఎం జగన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ప్లీనరీలో ప్రజల ఆశలకు, గత మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనేది చర్చిస్తామని ఉమ్మారెడ్డి చెప్పారు. మార్పులు అవసరమైతే తీసుకోవటానికి వెనకడుగు వేయమన్నారు. ప్లీనరీలో 15 వరకు తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని.. రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.
Read Also: Governor TamiliSai: అప్పటి వరకు ఆగకండి.. వయసు ఉన్నప్పుడే పెళ్లిచేసుకోండి
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
అటు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2017లో ప్లీనరీ నిర్వహించామని.. జూలై 8, 9 తేదీలకు ఒక ప్రాధాన్యత ఉందని తెలిపారు. 2027లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. కిక్ బాబు ఔట్… అండ్ సర్వ్ ద పీపుల్ తమ నినాదం అని.. వచ్చే ఎన్నికల్లో ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్లీనరీకి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని.. అధ్యక్షుడి ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. పలు తీర్మానాలు, సవరణలను ప్లీనరీ ప్రతిపాదిస్తుందని తెలిపారు.
ఐదేళ్ళ కిందట చారిత్రాత్మక ప్లీనరీని ఇదే ప్రాంతంలో నిర్వహించామని.. ఇప్పుడు నిర్వహించే ప్లీనరీలో భవిష్యత్ చిత్ర పటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది కేవలం పార్టీకి సంబంధించిన ప్లీనరీ మాత్రమే కాదన్నారు. ప్రజల ఎజెండాతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై సమగ్ర చర్చ ఉంటుందని తెలియజేశారు. వార్డు స్థాయిలో పోటీ చేసిన వ్యక్తికి సైతం సీఎం జగన్ స్వయంగా చేసిన సంతకంతో ఆహ్వాన లేఖను అందిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. ఇది కూడా ఒక ఆహ్వానంగా అందరూ భావించి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మీడియా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!