1. నేడు, రేపు హైదరాబాద్లో 34 ఎంఎంటీఎస్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వారాంతంలో ప్రయాణికులు లేని కారణంగా వరుసగా రెండో వారం కూడా దక్షిణ మధ్య రైల్వే రైళ్లను రద్దు చేసింది.
2. నేడు మోడీ పర్యటనపై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనుంది. పార్టీ నేతలతో బండి సంజయ్, కిషన్రెడ్డిలు సమావేశంకానున్నారు.
3. నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతుం జాతీయ పర్యటనలో ఉన్నారు.
4. నేటి నుంచి విశాఖపట్నం రైతుల బజార్లలో సబ్సిడీపై టమోటా అమ్మకాలు నిర్వహించునన్నారు. కేజీ టమోటా రూ.60 చొప్పున విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
5. నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లనుంది.
6. ఐపీఎల్ సీజన్ 2022లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ముంబాయి వేదికగా రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
7. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,950లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.65,900లుగా ఉంది.