NTV Telugu Site icon

యువత రాణిస్తేనే దేశాభివృద్ధి- వెస్ట్ బెంగాల్ డీజీపీ బీఎన్‌ రమేష్

యువత రాణిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు వెస్ట్ బెంగాల్ డీజీపీ BN రమేష్. విశాఖలో పర్యటిస్తున్న రమేష్ నగరంలో పలు విద్యా సంస్థలను సందర్శించి విద్యార్ధులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల్లో దేశ భక్తి పెంపొందింప చేసేలా ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

యువత, విద్యార్థులు దేశానికి వెన్నెముక వంటి వారన్నారు రమేష్. విద్యార్థి దశ చాలా కీలకం అన్నారు. ప్రతీ ఒక్కరు దేశ సేవలో పాల్గొనాలని, దేశరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. దేశ భవిష్యత్ యువత మీదే ఆధారపడి ఉందన్నారు. అన్ని రంగాల్లో యువత రాణిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు రమేష్. భరతమాత గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరు దేశం యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకు దేశానికి సేవ చేస్తానన్నారు పశ్చిమబెంగాల్ డీజీపీ బీఎన్ రమేష్.