Vizianagaram: డ్రోన్ కెమెరాలో బందీగా తాటిపూడి రిజర్వాయర్ అందాలు.. పచ్చని కొండల మధ్య అద్భుత దృశ్యం
- విజయనగరం జిల్లాలో అనేక ప్రాజెక్టులు..
- తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి వరద నీటి విడుదల..
- తాటిపూడి అందాలను తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram: విజయనగరం జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, ఆండ్ర, గడిగెడ్డ, తాటిపూడి జలాశయాల కింద దాదాపు 40 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇక, గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం దగ్గర గోస్తనీ నదిపై జలాశయం నిర్మించారు. 1965- 1968 మధ్య కాలంలో 1.85 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు. ఈ జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులుగా ఉంది. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగు నీరు, విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగు నీరు అందుతోంది. ఈ జలాశయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఆధునీకరణ పనులు చేపట్టక పోవడంతో సాగునీటి కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
అయితే, ఇప్పుడు ఈ తాటిపూడి ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు జపాన్ నిధులు రూ.24.92 కోట్లు మంజూరు అయ్యాయి. టెండర్లు ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖ నగరానికి ప్రతి రోజు 11 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముషిడిపిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్ కు ఎగువన కురుస్తున్న వర్షాలకి పూర్తిగా నిండుకుంది. వర్షాల కొనసాగడంతో మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ
ఇక, తాటిపూడి రిజర్వాయర్ కు ఉన్న నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ నీటి ప్రవాహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిగువన విజయనగరం నుంచి శృంగవరపుకోటకు వెళ్లే మార్గం నుంచి ఈ ప్రాజెక్టును జనం తిలకిస్తున్నారు. అలాగే, రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది. చుట్టూ కొండలపై పచ్చని సుందరమైన దృశ్యాలు డ్రోన్లతో పర్యాటకులు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతి రమణీయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!