Vizianagaram: డ్రోన్ కెమెరాలో బందీగా తాటిపూడి రిజర్వాయర్ అందాలు.. పచ్చని కొండల మధ్య అద్భుత దృశ్యం
- విజయనగరం జిల్లాలో అనేక ప్రాజెక్టులు..
- తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి వరద నీటి విడుదల..
- తాటిపూడి అందాలను తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram: విజయనగరం జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, ఆండ్ర, గడిగెడ్డ, తాటిపూడి జలాశయాల కింద దాదాపు 40 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇక, గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం దగ్గర గోస్తనీ నదిపై జలాశయం నిర్మించారు. 1965- 1968 మధ్య కాలంలో 1.85 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు. ఈ జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులుగా ఉంది. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగు నీరు, విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగు నీరు అందుతోంది. ఈ జలాశయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఆధునీకరణ పనులు చేపట్టక పోవడంతో సాగునీటి కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
అయితే, ఇప్పుడు ఈ తాటిపూడి ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు జపాన్ నిధులు రూ.24.92 కోట్లు మంజూరు అయ్యాయి. టెండర్లు ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖ నగరానికి ప్రతి రోజు 11 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముషిడిపిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్ కు ఎగువన కురుస్తున్న వర్షాలకి పూర్తిగా నిండుకుంది. వర్షాల కొనసాగడంతో మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ
ఇక, తాటిపూడి రిజర్వాయర్ కు ఉన్న నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ నీటి ప్రవాహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిగువన విజయనగరం నుంచి శృంగవరపుకోటకు వెళ్లే మార్గం నుంచి ఈ ప్రాజెక్టును జనం తిలకిస్తున్నారు. అలాగే, రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది. చుట్టూ కొండలపై పచ్చని సుందరమైన దృశ్యాలు డ్రోన్లతో పర్యాటకులు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతి రమణీయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!