Vijayawada: నేడు విజయవాడకు కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- నేడు విజయవాడుకు బండి సంజయ్ కుమార్- మల్లు భట్టి విక్రమార్క..
- బేగంపేట ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు బయలుదేరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పెద్దలనే కాకుండా చిన్నారులను సైతం ఇబ్బంది పెడుతోంది. విజయవాడలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఈనేపథ్యంలో.. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఇద్దరు ఒకే హెలికాప్టర్ లో కూర్చుని విజయవాడకు బయలుదేరారు. కొద్ది సేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , భట్టి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మం జిల్లాలో బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే చేయనున్నారు. శివరాజ్ సింగ్, బండి సంజయ్ తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాశ్ నగర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కూసుమంచి మండలం జుజ్జులురావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను శివరాజ్ సింగ్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు సందర్శించనున్నారు.
Read also: Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!
Also Read
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
అనంతరం పాలేరు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలిస్తారు. అక్కడే భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో శివరాజ్ సింగ్, బండి సంజయ్ మాట్లాడనున్నారు. అక్కడి నుండి మోతె హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నాఉ. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట చేరుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. 10 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయానికి బండి సంజయ్ కుమార్ రాబోతున్నారు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్ లో పాల్గొననున్నారు. సచివాలయంలో మీటింగ్ అనంతరం శివరాజ్ సింగ్ తో కలిసి బండి సంజయ్ బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ వెళ్లనున్నట్లు సమాచారం. శివరాజ్ సింగ్ కు వీడ్కోలు అనంతరం బండి సంజయ్ నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు. శివరాజ్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన నేపథ్యంలో కోదాడ పర్యటనను రద్దు చేసుకున్నారు.
Telangana Govt: నేటి నుంచి ఖమ్మంలో వరద బాధితులకు రూ. 10వేలు పంపిణీ..
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!