Vijayawada: నేడు విజయవాడకు కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- నేడు విజయవాడుకు బండి సంజయ్ కుమార్- మల్లు భట్టి విక్రమార్క..
- బేగంపేట ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు బయలుదేరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పెద్దలనే కాకుండా చిన్నారులను సైతం ఇబ్బంది పెడుతోంది. విజయవాడలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఈనేపథ్యంలో.. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఇద్దరు ఒకే హెలికాప్టర్ లో కూర్చుని విజయవాడకు బయలుదేరారు. కొద్ది సేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , భట్టి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మం జిల్లాలో బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే చేయనున్నారు. శివరాజ్ సింగ్, బండి సంజయ్ తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాశ్ నగర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కూసుమంచి మండలం జుజ్జులురావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను శివరాజ్ సింగ్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు సందర్శించనున్నారు.
Read also: Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
అనంతరం పాలేరు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలిస్తారు. అక్కడే భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో శివరాజ్ సింగ్, బండి సంజయ్ మాట్లాడనున్నారు. అక్కడి నుండి మోతె హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నాఉ. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట చేరుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. 10 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయానికి బండి సంజయ్ కుమార్ రాబోతున్నారు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్ లో పాల్గొననున్నారు. సచివాలయంలో మీటింగ్ అనంతరం శివరాజ్ సింగ్ తో కలిసి బండి సంజయ్ బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ వెళ్లనున్నట్లు సమాచారం. శివరాజ్ సింగ్ కు వీడ్కోలు అనంతరం బండి సంజయ్ నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు. శివరాజ్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన నేపథ్యంలో కోదాడ పర్యటనను రద్దు చేసుకున్నారు.
Telangana Govt: నేటి నుంచి ఖమ్మంలో వరద బాధితులకు రూ. 10వేలు పంపిణీ..
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!